
గ్రామీణ ప్రజల్లో ఆధ్యాత్మిక భావం
– మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు: గ్రామీణ ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు పె రిగాయని, ప్రతి గ్రామంలోను ఆలయాలు నిర్మిస్తున్నారని, ప్రజలందరూ సన్మార్గంలో నడిచేందుకు పునాదు లు పడుతున్నారని రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండలంలోని జౌకొత్తూరులో బోయకొండ గంగమ్మ ఆలయాన్ని ప్రారంభించి, పూజలు చేశారు. అలాగే మరస నపల్లెలో సీతారామ లక్ష్మణుల ఆలయాన్ని పూజలు చే సి, ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పె ద్దిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గంగమ్మ ఆలయాలు, శ్రీరామచంద్రుడు, ఆంజనేయస్వామి, నరసింహస్వా మి ఆలయాలతోపాటు ప్రతి గ్రామంలోనూ గ్రామదేవతల ఆలయాలు నిర్మిస్తూ , భక్తిమార్గం వైపు పయనిస్తుండడం శుభపరిణామమన్నారు. ఆలయాలు, మసీదులు, చర్చిల నిర్మాణాలకు తమ కుటుంబం వ్యక్తిగ తంగా సహాయసహకారాలు అందిస్తుందన్నారు. ప్రజ లు ప్రతి రోజూ ఆలయాలకు వెళ్లడం అలవర్చుకోవాలన్నారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి, మాజీ ఎంపీపీ నరసింహులు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు అమరనాథరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రజల్లో ఆధ్యాత్మిక భావం