
ఉద్యోగులపై కపట ప్రేమ
చిత్తూరు కార్పొరేషన్: కూటమి సర్కారు ఉద్యోగులపై కపట ప్రేమ చూపుతోందని వైఎస్సార్సీపీ ఉద్యోగు లు, పెన్సన్షర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ యన మాట్లాడారు. అధికారం కోసం ఉద్యోగులకు అ డ్డమైన హామీలిచ్చి తీరా వాటిని విస్మరించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అధికారంలో వచ్చి 11 నెలలవుతున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ఇ చ్చిన హామీలు ఏమయ్యాయో చంద్రబాబు, లోకేష్, పవన్కల్యాణ్లు చెప్పాలన్నారు. ప్రతినెల సక్రమంగా జీతాలు కూడ ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. ఉ ద్యోగులకు అన్ని రకాలుగా కలిపి మొత్తం రూ.30 వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందుల పేరిట కాలయాపన చేయడం సరికాదన్నారు. సీపీఎస్ రద్దు ఎప్పుడు చేస్తారోనని 3 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు వేచి చూస్తున్నాయన్నారు. పీఆర్సీ కమిషన్ తీసి వేశారని, ఉద్యోగులకు మూడు డీఎలు పెండింగ్లో ఉన్నాయన్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై అన్ని సంఘాలను కలిసి సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసి దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. మెదలియార్ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్, ఉద్యోగుల సంఘం నాయకులు ప్రసాద్రెడ్డి, నాయకులు మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.