
జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గురువారం గరిష్టంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మాట్లాడుతున్న మంశ్రీత్రి పెద్దిరెడ్డి, అభివాదం చేస్తున్న వెంకటేగౌడ
పలమనేరులో..
వైఎస్సార్సీపీ పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.వెంకటేగౌడ సుమారు 10వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఓంశక్తి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సతీమణి పావని కూడా మరో సెట్ నామినేషన్ను సమర్పించారు. అనంతరం ఓంశక్తి ఆలయం నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు అఖండ విజయం చేకూర్చాలని పిలుపునిచ్చారు.
– 8లో
– 8లో