బుల్ జోరు,లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
ద్రవ్యోల్బణ ఆందోళనలు,మండుతున్న ముడిచమురు ధరలు మార్కెట్ను సెంటిమెంట్ను దెబ్బ తీస్తున్నాయి. అయినా సరే దేశియ మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి.
గురువారం ఉదయం ఇండియన్ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల మార్కెట్ల సమయానికి సెన్సెక్స్ 546 పాయింట్ల లాభంతో 59736 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తుంది. నిఫ్టీ సైతం లాభాల్లో కొనసాగుతుంది. నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో 17805 వద్ద ట్రేడ్ అవుతోంది.
టైటన్ కంపెనీ, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, మారుతి సుజికీ, ఎథీర్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్ లార్సెన్ స్టాక్స్ లాభాల్లో ఉండగా.. ఓఎన్జీసీ, కోల్ ఇండియా,దివీస్ ల్యాబ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.