వరుస లాభాలకు ‍బ్రేక్‌.. నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

వరుస లాభాలకు ‍బ్రేక్‌.. నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Jun 10 2024 3:32 PM | Updated on Jun 10 2024 3:32 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాల్లోకి చేరాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 55 పాయింట్లు తగ్గి 23,234 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 203 పాయింట్లు దిగజారి 76,490 వద్ద ముగిసింది. గతవారంలోని వరుస మూడు రోజుల లాభాలకు బ్రేక్‌ పడినట్లయింది. మదుపర్లు గరిష్ఠాల వద్ద షేర్లు విక్రయించినట్లు తెలుస్తుంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌గ్రిడ్‌, నెస్లే, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌, సన్‌ ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.

టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, విప్రో, ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ సుజుకీ, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటాన్‌, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, కొటక్‌మహీంద్రా బ్యాంక్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి చేరుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement