బుల్ జోరు..భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు | Stock Market: Nifty ends above 17200, Sensex gains over 500 pts | Sakshi
Sakshi News home page

బుల్ జోరు..భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sep 2 2021 4:20 PM | Updated on Sep 2 2021 4:21 PM

Stock Market: Nifty ends above 17200, Sensex gains over 500 pts - Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి తమ జోరును కొనసాగించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు ‎ఐటీ, ఎఫ్ఎంసిజి, సీమెంట్ షేర్ల అండతో బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. చివరకు, సెన్సెక్స్ 514.33 పాయింట్లు (0.90%) పెరిగి 57852.54 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 157.90 పాయింట్లు (0.92%) లాభపడి 17234.20 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.05 వద్ద నిలిచింది.‎

‎శ్రీ సిమెంట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, సీప్లా, టిసీఎస్, హెచ్‌యుఎల్ షేర్లు నిఫ్టీలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఎం అండ్ ఎం, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఓఎన్ జీసీ, దివిస్ ల్యాబ్స్ టాప్ లూజర్లలో ఉన్నాయి.‎ ‎ఆటో, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ మినహా అన్ని ఇతర ఐటీ, ఫార్మా సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరగడంతో లాభాలతో ముగిశాయి.(చదవండి: భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు ఖాయం!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement