Mahindra To Launch 16 Electric Vehicles Models By 2027, Plans To Invest RS 3000 Crore In EVs
Sakshi News home page

ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌పై మహీంద్రా కంపెనీ దండయాత్ర

Nov 10 2021 4:16 PM | Updated on Nov 10 2021 7:03 PM

Mahindra to Launch 16 Electric Vehicles - Sakshi

Mahindra Electric Vehicles: ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌పై దండయాత్ర చేసేందుకు సిద్దం అవుతుంది.

Mahindra Plans To Launch 16 EV Models By 2027: ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ తయారీ దిగ్గజం మహీంద్రా & మహీంద్రా ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌పై దండయాత్ర చేసేందుకు సిద్దం అవుతుంది. భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలో తన నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఎస్​యూవీ, లైట్ కమర్షియల్ వెహికల్ విభాగాలలో 2027 నాటికి 16 మోడల్స్ ఎలక్ట్రిక్ వాహనాలను(ఈవీలు) ప్రారంభించాలని యోచిస్తోంది. 2025 నాటికి ఆదాయంలో 15-20 శాతం వృద్ధి సాధించాలని కంపెనీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి, కంపెనీ వృద్ధి చెందడానికి ఎలక్ట్రిక్ వాహనావ్యాపారాన్ని ప్రత్యేక సంస్థగా తీసుకొని రావాలని చూస్తుంది. ఎలక్ట్రిక్ వాహనా రంగంలో రూ.3,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. అలాగే, 2027 నాటికి విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ ఎస్​యూవీలకు కొత్త బ్రాండ్ పేరును కూడా పరిశీలిస్తోంది.

"మేము 2027 నాటికి ఎస్​యూవీలో 13 కొత్త వాహనాలను లాంచ్‌ చేయాలని చూస్తున్నాము, వాటిలో ఎనిమిది ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయి. 2027 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల నుంచి వచ్చే వాహనాలు మొత్తం UV(యుటిలిటీ వెహికల్స్) వాల్యూమ్‌లలో కనీసం 20 శాతం ఉంటాయి" అని ఎమ్&ఎమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ వర్చువల్ ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్‌లో మీడియాతో పేర్కొన్నారు. కొత్త ఎలక్ట్రిక్ ఎస్​యూవీలలో నాలుగు 2025-27 మధ్య వచ్చే అవకాశం ఉంది. 2027 నాటికి 17 కొత్త వాహన లాంచ్‌లలో ఎనిమిది ఈవీలు కూడా ఉంటాయని ఆయన అన్నారు. 

(చదవండి: నిద్రపోతున్నా సరే అతడి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెరుగుతూనే ఉంది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement