రామయ్యకు సువర్ణ తులసీ అర్చన | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

Sep 7 2025 7:38 AM | Updated on Sep 7 2025 8:00 AM

కొత్తగూడెంటౌన్‌: ఈనెల 13న కొత్తగూడెం జిల్లా కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెండింగ్‌ కేసుల పరిష్కారానికి అందరూ సమన్వయంతో పని చేయాలని కోరారు. సివిల్‌, చీటింగ్‌, భూ తగాదాలు, చిట్‌ఫండ్‌, బ్యాంక్‌ లావాదేవీలు, కుటుంబ తగాదాలు, వివాహ సంబంధ తదితర రాజీ కాదగిన కేసులను లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు. వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించి జిల్లాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు పోలీసు అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భద్రాచలంఅర్బన్‌ : గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ముగించుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వద్ద గోదావరి నదిలో విగ్రహాల నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు పూర్తి చేయాలని ఎస్పీ రోహిత్‌రాజు కోరారు. గోదావరి ఘాట్‌ను శనివారం ఆయన సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జనం సందర్భంగా ఊరేగింపులో డీజేలు, బాణాసంచా కాల్చడం నిషేధమని, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భద్రాచలంలో ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టామని వివరించారు. ఏఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ.. నిమజ్జనోత్సవంలో జాప్యం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో టౌన్‌ సీఐ నాగరాజు, డీఎల్‌పీఓ సుధీర్‌, తహశీల్దార్‌ వెంకటేశ్వర్లు, గ్రామ పంచాయతీ ఈఓ శ్రీనివాసరావు, ఇరిగేషన్‌ డీఈఈ మధుసూదన్‌, జేఈ వెంకటేశ్‌ పాల్గొన్నారు.

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

నేడు పర్ణశాల ఆలయం మూసివేత

దుమ్ముగూడెం : చంద్రగ్రహణం సందర్భంగా పర్ణశాల రామాలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మూసివేస్తామని ఆలయ ఇన్‌చార్జ్‌ అనిల్‌కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ తలుపులు తెరిచి సంప్రోక్షణ, వైదిక కార్యక్రమాల అనంతరం 7.30 గంటలకు దర్శనాలు పునఃప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.

13న జాతీయ

లోక్‌ అదాలత్‌

పోలీసుల సూచనలు పాటించాలి : ఎస్పీ

గణేశ్‌ నిమజ్జనంలో

జాగ్రత్తలు పాటించాలి

ఐటీడీఏ పీఓ రాహుల్‌

భద్రాచలం : గణేశ్‌ నిమజ్జనోత్సవాల సందర్భంగా భక్తులు పలు జాగ్రత్తలు పాటించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ సూచించారు. ఐటీడీఏ కార్యాలయ సిబ్బంది క్వార్టర్ల వద్ద గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం న్నదాన కార్యక్రమం నిర్వహించగా పీఓ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ వేడుకలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా చూడాలన్నారు. పోలీసులు, ఇతర అధికారులు సూచనలు పాటిస్తూ విగ్రహాలను నిమజ్జనం చేయాలన్నారు. కార్యక్రమంలో ఏటీడీఓ అశోక్‌ కుమార్‌, డీఈ హరీష్‌, టీఏ శ్రీనివాస్‌, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ డీటీ లక్ష్మీనారాయణ, ఈఈ వెంకటస్వామి, డీడీ ప్రమీలాబాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

రామయ్యకు  సువర్ణ తులసీ అర్చన1
1/1

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement