
సింగరేణి డైరెక్టర్(పా)గా గౌతమ్ పొట్రు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి డైరెక్టర్(పా)గా గౌతమ్ పొట్రును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న గౌతమ్.. గతంలో భద్రాచలం ఐటీడీఏ పీఓగా విధులు నిర్వర్తించారు. కాగా, 2014 నుంచి సింగరేణిలో పూర్తిస్థాయి డైరెక్టర్(పా) ఐఏఎస్ను నియమించకుండా సంస్థలో పనిచేస్తున్న అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో పాలన కుంటుపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఐఏఎస్ అధికారిని నియమించడం పట్ల కార్మికులు, కార్మిక సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.