
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా శ్రీహరి
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రిగా పశుసంవర్థకశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్థానంలో శ్రీహరిని ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్గా నియమించారు. అలాగే, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉమ్మడి వరంగల్కు కొనసాగిస్తూ, నల్లగొండ ఇన్చార్జ్గా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జిగా నియమించారు.