
నవజాత శిశువుకు చికిత్స
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో బరువు తక్కువగా ఉన్న నవజాత శిశువుకు చికిత్స అందించారు. గత ఏప్రిల్ 27న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరా జు జిల్లా కూనవరం మండలం పందరాజపల్లికి చెందిన శాంతకుమారికి తక్కువబరువుతో బిడ్డ జన్మించింది. దీంతో ఎస్ఎన్సీయూలో చేర్పించి వైద్యం 40 రోజులపాటు వైద్యం అందించారు. ఆస్పత్రిలో చేరినప్పుడు శిశువు కేవలం 900 గ్రాములు మాత్రమే ఉండగా, చికిత్స పొందా క బరువు 1400 గ్రాములకు చేరింది. దీంతో తల్లిండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ వైద్యలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇదే చికిత్సకు ప్రైవే టు ఆస్పత్రిలో అయితే రూ. 20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు.
126 మందికి జరిమానా
సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం కోర్టులో బుధవారం 126 మందికి జరిమానా విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజ మల్లు తీర్పు చెప్పారు. కొత్తగూడెం వన్, టూ, త్రీటౌన్, ట్రాఫిక్, సుజాతనగర్, పాల్వంచ, చండ్రుగొండ, చుంచుపల్లి, ములకలపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీ చేపట్టి మద్యం తాగి వాహనాలను నడుపుతున్న వారిని గుర్తించారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా, నేరం రుజువు కావడంతో మొత్తం 126 మందికి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
విద్యలో మేటి..
మాంటిస్సోరి
మణుగూరు టౌన్: ఏజెన్సీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని మణుగూరులోని శ్రీ సత్యభాస్కర హైస్కూల్, మాంటిస్సోరి ప్రైవేట్ స్కూల్ నిర్వాహకులు తెలిపారు. కేరళ, మహారాష్ట్ర, ఒడిశాలకు చెందిన నిష్ణాతులైన ఉపాధ్యాయులు, డిజిటల్ ల్యాబ్, అధునాతన తరగతి గదులతో బోధన సాగుతోందని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మండల స్థాయి మొదటి, రెండు ర్యాంకులు తమ విద్యార్థులు సాధించారని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని వివరించారు.
నర్సింగ్ విద్యకు కేరాఫ్.. అరోరా
పాల్వంచ: అందరికీ అందుబాటులో ఉండేలా నర్సింగ్ విద్యను అందుబాటులో తీసుకొచ్చామని అరోరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల చైర్మన్ తాళ్లూరి హరిబాబు తెలిపారు. పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నామని, ఆరోగ్య సంరక్షణ రంగంలో ముఖ్యపాత్రపోషించే నర్సింగ్ కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. అత్యాధునిక ల్యాబ్లతో జీఎన్ఎం(జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ) కోర్సు అందిస్తున్నామని తెలిపారు. తమ సేవలకు ఫలితంగా ఇటీవల డాక్టరేట్ పురస్కారం లభించిందని పేర్కొన్నారు.
విద్యాకుసుమం..
లిటిల్ ఫ్లవర్స్
భద్రాచలంటౌన్: విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగేలా లిటిల్ ఫ్లవర్స్ స్కూల్, కళాశాలలు పట్టుగొమ్మల్లా నిలుస్తున్నాయని విద్యాసంస్థల డైరెక్టర్లు మాగంటి శ్రీనివాస వరప్రసాద్, మాగంటి రమేష్బాబు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో 46 ఏళ్లుగా ఉత్తమ విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఏటా ఎన్నో రాష్ట్ర, జిల్లా స్థాయి ర్యాంకులు సాధిస్తున్నారని, ఉత్తమ బోధన అందిస్తున్నామనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు.