ఆ ఎనిమిది మంది మాటేంటి..? | - | Sakshi
Sakshi News home page

ఆ ఎనిమిది మంది మాటేంటి..?

May 29 2025 12:12 AM | Updated on May 29 2025 12:12 AM

ఆ ఎని

ఆ ఎనిమిది మంది మాటేంటి..?

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా మాడ వీధుల విస్తరణలో భూ సేకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. రెండు, మూడు రోజులుగా పాక్షిక పరిహారం తీసుకున్న చిరు వ్యాపారులు, భూ యజమానులు దుకాణాలు, ఇళ్లను ఖాళీ చేశారు. దీంతో రెవెన్యూ అఽధికారులు బుధవారం ఆ ఇళ్లను తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. అయితే రామాలయానికి వచ్చే భక్తుల రద్దీ, స్థానికుల రాకపోకలు అధికంగా సాగుతుండడంతో రాత్రి వేళల్లోనే పూర్తి చేయాలని నిర్ణయించారు. కాగా పరిహారం తీసుకున్న వారు ఖాళీ చేసినా, తీసుకునేందుకు విముఖత చూపిన ఎనిమిది మంది ఇళ్ల తొలగింపు, స్వాధీనంపై మాత్రం స్పష్టత రాలేదు. దీంతో ఆ భవనాల్లో అద్దెకు దుకాణాలను నిర్వహిస్తున్న వారు దర్జాగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.

కలెక్టర్‌ చొరవ చూపితేనే..

మాడ వీధుల విస్తరణలో ఆలయం చుట్టుపక్కల 40 ఇళ్లను తొలగించాలని దేవస్థానం, రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ఇందుకు 32 మంది అంగీకరించగా.. అధికారులు మూడో వంతు నష్టపరిహారం కూడా అందజేశారు. మిగితా మొత్వం ఇళ్లు ఖాళీ చేశాక ఇచ్చేందుకు పరస్పర అంగీకారం కుదిరింది. దీంతో వారంతా ఇళ్లు, షాపులు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయితే ఎనిమిది మంది మాత్రం ప్రభుత్వ నష్ట పరిహారం సరిపోవడం లేదంటూ స్వీకరణకు విముఖత చూపారు. గతంలో సైతం ఆలయ విస్తరణ సమయంలో ఒప్పుకోని ఇద్దరితో పాటు మరో ఆరుగురు ఈసారి కూడా ముందుకురాలేదు. పరిహారం పెంచితేనే ఖాళీ చేస్తామంటూ భీష్మించారు. దీంతో ఆ ఎనిమిది ఇళ్ల తొలగింపు అడ్డుగా మారింది. పడమర మెట్లకు ఎదురుగా కొన్ని, దక్షిణం వైపున కొన్ని ఇళ్లు అలాగే ఉండిపోనున్నాయి. దీనిపై కలెక్టర్‌ చొరవ చూపితేనే రామాలయ అభివృద్ధిపై ప్రభుత్వ హామీ ముందుకు కదిలే పరిస్థితి కనిపించడం లేదు. కాగా ఖాళీ చేసిన భూ యజమానులకు బ్రిడ్జి సెంటర్‌లో ఉన్న ఆర్‌అండ్‌బీ స్థలాన్ని కేటాయిస్తామని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. గతంలోనే ఆ స్థలాన్ని చదును చేశామని, త్వరలోనే లాటరీ పద్ధతిలో నిర్వాసితులకు అప్పగిస్తామని తేల్చి చెప్పారు.

ప్రభుత్వంపై నమ్మకం పెట్టడమే తప్పా..

ప్రభుత్వంపై నమ్మకంతో, అధికారులు ఇచ్చిన నష్టపరిహారం తీసుకున్న చిరువ్యాపారులు, దుకాణ యజమానులు ఇప్పుడు అసంతృప్తివ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలువులు పూర్తికాకపోవడంతో భక్తుల రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో వ్యాపారాలు ఉన్నప్పటికీ హనుమాన్‌ జయంతి అనంతరం ఖాళీ చేస్తామని చెప్పిన మాట ప్రకారం స్థలాలను అప్పగించారు. అయితే పరిహారం తీసుకోని ఆఎనిమిది భవనాల్లోని అద్దె దుకాణాల్లో మాత్రం దర్జాగా వ్యాపారాలు సాగుతున్నాయి. దీంతో ఖాళీ చేసిన దుకాణాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ సమన్యాయం జరిగేలా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

భూ సేకరణలో పూర్తి కాని

నష్టపరిహారం

ఇళ్లను కూల్చివేస్తున్న రెవెన్యూ అధికారులు

ఒక వైపు ఖాళీలు, మరో వైపు దర్జాగా దుకాణాలు

త్వరలోనే స్థలాలు అప్పగిస్తాం

భూ సేకరణ పనులు వేగంగా నడుస్తున్నాయి. ఇళ్లు కూల్చివేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నాం. నష్టపరిహారం అందుకోని వారు సైతం తొలి దశలో అంగీకరించినవారే. వారితో సంప్రదింపులు జరిపి పూర్తి చేస్తాం. లేదంటే కోర్టు ద్వారా ఆ ఇళ్లను తొలగించి స్వాధీనం చేసుకుంటాం. ఖాళీ చేసిన వారు ఆందోళన చెందొద్దు. బ్రిడ్జి పాయింట్‌లో ఉన్న ఆర్‌అండ్‌బీ స్థలాన్ని త్వరలోనే నిర్వాసితులకు అప్పగిస్తాం.

– దామోదర్‌ రావు, ఆర్‌డీఓ

ఆ ఎనిమిది మంది మాటేంటి..?1
1/1

ఆ ఎనిమిది మంది మాటేంటి..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement