
కదిలిన కృషీవలుడు
ఈసారి నైరుతి రుతుపవనాలు ముందే పలకరించడంతో రైతులు ముమ్మరంగా వ్యవసాయ పనులు చేపడుతున్నారు.
IIలో
అందుబాటులో లేని కిట్లు
కొత్తగూడెంలోని సర్వజన ఆస్పత్రి, సింగరేణి ఆస్పత్రి, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం ఏరియా ఆస్పత్రుల్లో ఎక్కడా కరోనా పరీక్షలు చేసేందుకు కిట్లు లేవు. దీంతో ఆస్పత్రుల్లోని ల్యాబ్లు కూడా మూతపడి ఉన్నాయి. కొత్తగూడెం సర్వజన ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డు కూడా ఏర్పాటు చేయలేదు. ఇదే విషయమై ఆస్పత్రి ఆర్ఎంఓను సంప్రదిస్తే వార్డు ఏర్పాటు చేశామని, ప్రజలు భయపడతారని బోర్డు ఏర్పాటు చేయలేదని చెప్పారు. కానీ సాక్షి ఆధ్వర్యంలో ఆస్పత్రిలో పరిశీలించగా ఐసోలేషన్ వార్డు, కనీసం బెడ్లు కూడా ఏర్పాటు చేయనట్టు తేలింది. ల్యాబ్, ఆక్సిజన్ సరఫరా వంటి విషయాలను ఆర్ఎంఓ దృష్టికి తీసుకెళ్లగా, ఆ విషయాలు చెప్పేందుకు తనకు సమయం లేదని పేర్కొనడం గమనార్హం. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో వైద్యాధికారులు పూర్తిగా విఫలమైనట్లు తెలుస్తోంది.

కదిలిన కృషీవలుడు