
కేసు నమోదు
పాల్వంచరూరల్: వేగంగా అతి నిర్లక్ష్యంగా బుల్లెట్ వాహనాన్ని నడుపుతూ మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘనటలో ఇద్దరిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రుసుము అశోక్రెడ్డి, అఖి దంపతులు శుక్రవారం రాత్రిపాల్వంచ నుంచి ఇంటికి వెళ్తున్నారు.ఈక్రమంలో రంగాపురం వద్దకురాగానే పాల్వంచ వైపు నుంచి వస్తున్నబుల్లెట్ వాహనం ఢీకొట్టడంతో భార్యాభర్తలు కిందపడి గాయపడ్డారు. చికిత్సనిమిత్తం ఖమ్మానికి తరలించగా.. క్షతగాత్రుల బంధువైన రామకోటిరెడ్డిఫిర్యాదు మేరకు బుల్లెట్ నడుపుతున్నగడ్డం సంతోష్, వి.సంతోష్లపై కేసునమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
వ్యక్తి అదృశ్యంపై..
సూపర్బజార్(కొత్తగూడెం): వ్యక్తి అదృశ్యంపై రామవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం కేసు నమోదైంది. రామవరం సీఆర్పీ క్యాంపునకు చెందిన ఎస్కె.యూసుఫ్ (62) గత కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. బంధువుల ఇంటికి వెళ్లి ఉంటాడని కుటుంబసభ్యులు భావించగా.. నెల రోజులైనా ఇంటికి రాకపోవడంతో బంధువుల ఇళ్లలో వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. దీంతో యూసుఫ్ కుమారుడు పాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ ప్రతాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.