మహిళా ఎస్సైతో దురుసు ప్రవర్తన | - | Sakshi
Sakshi News home page

మహిళా ఎస్సైతో దురుసు ప్రవర్తన

Jun 8 2025 12:19 AM | Updated on Jun 8 2025 12:19 AM

మహిళా ఎస్సైతో దురుసు ప్రవర్తన

మహిళా ఎస్సైతో దురుసు ప్రవర్తన

కల్లూరు: విధినిర్వహణలో ఉన్న కల్లూరు ఎస్‌ఐ డి.హరితతో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కల్లూరు ఏసీపీ రఘు వెల్లడించారు. కల్లూరు పోలీసుస్టేషన్‌లో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. కల్లూరులోని చౌదరి హోటల్‌ వద్ద తల్లాడకు చెంది న రాయల రామారావు తదితరులు శుక్రవారం సాయంత్రం మధ్యం మత్తులో గొడవ చేస్తున్నారని యాజమాని మాగంటి బోసుబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయానికి వెళ్లిపోయిన రామారావు తిరిగి పలువురితో వచ్చి హోటల్‌ సిబ్బంది, యాజమానిని బెదిరించాడు. తనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే హోటల్‌ను నడవనిచ్చేది లేదని హెచ్చరిస్తుండగా ఎస్‌ఐ హరిత, సిబ్బందితో వచ్చా రు. మద్యం మత్తులో ఉన్న రామారావు, ఆయన అనుచరులను పంపించే ప్రయత్నంలో ఎస్సై, సిబ్బంది విధులను ఆటంకపరుస్తూ దాడి చేశారు. ఈమేరకు ఎస్‌ఐ ఫిర్యాదుతో పది మందిపై కేసు నమోదు కాగా, ప్రధాన నిందితుడు రాయల రామారావుతో పాటు ఏడుగురిని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. కాగా, రామారావుపై గతంలోనూ తల్లాడ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైందని వెల్లడించారు. ఈ సమావేశంలో సత్తుపల్లి రూరల్‌ సీఐ ముత్తులింగం, కల్లూరు, పెనుబల్లి ఎస్‌ఐలు డి.హరిత, వెంకటేష్‌ పాల్గొన్నారు.

పురుగుమందు తాగి వృద్ధురాలు ఆత్మహత్య

బూర్గంపాడు: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్గంపాడు మండలం ముసలిమడుగు గ్రామానికి చెందిన బోయిన రాంబాయమ్మ(69) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె శుక్రవారం ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి, అక్కడ నుంచి ఖమ్మంకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలికి భర్త, కొడుకు, కుమార్తె ఉన్నారు. భర్త రాములు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement