
గాలి, వాన బీభత్సం..
జూలూరుపాడు: మండలంలో శనివారం గాలి, వాన భీభత్సాన్ని సృష్టించింది. బలమైన ఈదురుగాలతో కూడిన భారీ వర్షం సుమారు గంటకు పైగా కురిసింది. దీంతో చెట్లు విరిగపడగా, ఇళ్ల పై కప్పు ఎగిరిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
●జూలూరుపాడు న్యూకాలనీలో చెట్లు విరిగిపడడంతో మూడు విద్యుత్ స్తంభాలు విరగగా.. మందా కమలాకర్ ఇంటిపై ఓ స్తంభం ఒరగడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్శాఖ అధికారులు, సిబ్బంది సుమారు నాలుగు గంటలకు పైగా శ్రమించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
●స్థానిక పోలీస్స్టేషన్ సమీపాన తల్లాడ–కొత్తగూడెం ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా.. పోలీసులు వాటిని తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
●సురారం గ్రామానికి చెందిన మాళోత్ సురేష్కు చెందిన కోళ్ల ఫారమ్ షెడ్ కుప్పకూలడంతో సుమారు 4 వేల కోడి పిల్లలు చనిపోయాయి. దీంతో సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది.
●అదే గ్రామానికి చెందిన బానోత్ నాగరాజు, తాటి వీరయ్య, పుట్టి లాలయ్య రేకుల ఇళ్ల పైకప్పు గాలికి ఎగిరిపోయింది.
●వీరభద్రాపురం గ్రామానికి చెందిన ఆశాకార్యకర్త కల్తి గోపారత్నం, శ్రీను దంపతుల రేకుల ఇంటి పైకప్పు ఎగిరిపోవడంతో ఇంట్లోని 5 క్వింటాళ్ల బియ్యం, వంట పాత్రలు, బట్టలు తడిసి ముద్దయ్యాయి. అంతేకాక రెండు టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతినడంతో సుమారు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లింది.
●వెంగన్నపాలెం, గుండెపుడి, నల్లబండబోడు, తదితర గ్రామాల్లో పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో పాటు చెట్లు విరిగిపడడంతో విద్యుత్తీగలు తెగిపడి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
విరిగిపడ్డ చెట్లు.. ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పు

గాలి, వాన బీభత్సం..

గాలి, వాన బీభత్సం..

గాలి, వాన బీభత్సం..