
మాజీ ఎమ్మెల్యేకు కన్నీటి వీడ్కోలు
● నివాళులర్పించిన మంత్రి తుమ్మల, వివిధ పార్టీల నేతలు ● పాడె మోసిన ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ
రఘునాథపాలెం: వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బానోత్ మదన్లాల్ అంత్యక్రియలను బుధవారం ఆయన స్వగ్రామమైన రఘునాథపాలెం మండలం ఈర్లపుడిలో నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ఆయన మృతదేహాన్ని మంగళవారం ఖమ్మం కవిరాజ్నగర్లోని నివాసగృహానికి తీసుకురాగా ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు నివాళులర్పించారు. అనంతరం ఈర్లపుడికి తరలించగా, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు మదన్లాల్ మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను ఓదార్చారు. ఆ తర్వాత అంత్యక్రియల్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తదితరులు పాడె మోశారు. అలాగే, ఇల్లెందు, జనగామ ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పల్లా రాజేశ్వరరెడ్డి, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, సండ్ర వెంకటవీరయ్య, తాటి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ మాలోతు కవితతో పాటు వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు తుళ్లూరి బ్రహ్మయ్య, రాంరెడ్డి గోపాల్రెడ్డి, ఏనుగుల రాకేశ్రెడ్డి, దిండిగల రాజేందర్, బెల్లయ్యనాయక్, కూరాకుల నాగభూషణం, పగడాల నాగరాజు, బచ్చు విజయ్కుమార్, అజ్మీరా వీరూనాయక్, మాదంశెట్టి హరిప్రసాద్, గుత్తా రవి, మెంటెం రామారావు, పిన్ని కోటేశ్వరరావు, చెరుకూరి ప్రదీప్, కూరాకుల వలరాజు, నాగండ్ల కోటి, మానుకొండ రాధాకిశోర్ తదితరులు సైతం మదన్లాల్ మృతదేహం వద్ద నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.