ఇంకుడుగుంతలతో లాభాలెన్నో.. | - | Sakshi
Sakshi News home page

ఇంకుడుగుంతలతో లాభాలెన్నో..

May 25 2025 7:23 AM | Updated on May 25 2025 7:23 AM

ఇంకుడుగుంతలతో లాభాలెన్నో..

ఇంకుడుగుంతలతో లాభాలెన్నో..

అశ్వారావుపేటరూరల్‌/మణుగూరురూరల్‌/సుజాతనగర్‌: ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెరుగుతాయని, నీటి వృథాను అరికట్టేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, ఇళ్లల్లోనూ తప్పనిసరిగా వాటిని నిర్మించుకోవాలని అధికారులు సూచించారు. ఇంకుడుగుంతలతో నీటి కొరత తీరుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 20 వేల ఇంకుడుగుంతలు నిర్మించాలని, ఇంకా 10 వేల ఇంకుడుగుంతలు నిర్మించనున్నామని వెల్లడించారు. శనివారం అశ్వారావుపే మండలంలోని వినాయకపురం పీహెచ్‌సీతోపాటు ఎంపీడీఓ కార్యాలయాన్ని జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తులపై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అలాగే మణుగూరు మండలంలోని తోగ్గూడెం, కట్టుమల్లారం, ముత్యాలమ్మనగర్‌ తదితర గ్రామాల్లో డీఆర్‌డీఓ, అదనపు కలెక్టర్‌ విద్యాచందన పర్యటించి ఇంకుడుగుంతలను పరిశీలించారు. అలాగే, సుజాతనగర్‌ మండలంలోని వేపలగడ్డ, రాఘవాపురం గ్రామాల్లో నిర్మిస్తున్న ఇంకుడుగుంతలను డీపీఓ చంద్రమౌళి పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో శ్రీనివాసరావు, నల్లబోతుల రవి, ప్రవీణ్‌కుమార్‌, రాందాస్‌నాయక్‌, రామచందర్‌రావు, అక్షిత, ముత్తారావు, మనోహర్‌, తేళ్లూరి శ్రీనివాసరావు, పల్నాటి వెంకటేశ్వరరావు, చెన్నకేశవరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నిర్మాణాలను పరిశీలించిన అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement