ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం

May 27 2025 12:25 AM | Updated on May 27 2025 12:25 AM

ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం

ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం

పాల్వంచ: ప్రస్తుతం తరగతి గది డిజిటల్‌ తరగతి గదిగా మారనున్న తరుణంలో ఉపాధ్యాయులు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన పెంచుకోవాలని, తద్వారా విద్యా బోధన చేయాలని డీఈఓ ఎం.వెంకటేశ్వరా చారి అన్నారు. స్థానిక కొమ్ముగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణా తరగతులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగేలా కృషి చేయాలని చెప్పారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధిస్తే ఆశించిన ఫలితాలు వస్తాయని, తద్వారా ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులకు నమ్మకం ఏర్పడుతుందని వివరించారు. అనంతరం కేటీపీఎస్‌ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న హిందీ ఉపాధ్యాయుల శిక్షణ శిబి రాన్ని సందర్శించారు. భోజనం చేసి కోర్సు డైరెక్టర్‌ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా మానిట రింగ్‌ అధికారి ఎ.నాగ రాజశేఖర్‌, సెంటర్‌ ఇన్‌చార్జ్‌ లు ఎస్‌కే.సైదులు, బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

డీఈఓ వెంకటేశ్వరా చారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement