
కొండరెడ్లకు గృహ నిర్మాణాలు
సూపర్బజార్(కొత్తగూడెం): అటవీప్రాంతంలో నివసిస్తున్న కొండరెడ్ల గిరిజన కుటుంబాలకు పీఎం జన్ధన్ పథకం కింద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఎంపీడీఓలు ప్రతిపాదనలు అందజేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం దమ్మపేట, అశ్వారావుపేట మండలాల ఎంపీడీఓలు, కొండరెడ్ల గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అశ్వారావుపేట మండలంలోని ఏడు హ్యాబిటేషన్లు, దమ్మపేట మండలంలోని పూసుకుంట గ్రామంలోని కొండరెడ్ల గిరిజన కుటుంబాల ఇంటింటికి తిరిగి మొబైల్యాప్ ద్వారా సర్వే చేయాలని ఆదేశించారు. శనివారం నుంచి సర్వే ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ సహాయ ప్రాజెక్ట్ అధికారి డేవిడ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్