సాగుకు సమాయత్తం..! | - | Sakshi
Sakshi News home page

సాగుకు సమాయత్తం..!

May 5 2025 8:36 AM | Updated on May 5 2025 8:36 AM

సాగుక

సాగుకు సమాయత్తం..!

ముగిసిన యాసంగి పనులు
● ముందే పంట పొలాలను సిద్ధం చేసుకుంటున్న ఏజెన్సీ వాసులు ● వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు యత్నాలు ● యాజమాన్య పద్ధతులు మేలంటున్న వ్యవసాయాధికారులు

చర్ల: ఖరీఫ్‌, రబీ పంటల సాగు పూర్తవ్వడంతో రైతులు కాస్తా ఉపశమనం పొందుతూనే మళ్లీ జూన్‌ నుంచి ఆరంభమయ్యే ఖరీఫ్‌ పనుల సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈనేపథ్యాన ఉదయం, సాయంత్రం వేళల్లో మిర్చి, పత్తి పంట పొలాలను సందర్శిస్తూ సాగుకు అవసరమయ్యే పనులను చేపడుతున్నారు. ప్రస్తుతం మెట్ట, మాగాణి భూములన్నీ ఖాళీగా ఉండగా.. రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.

భూసారం పెంపునకు ప్రయత్నాలు..

జూన్‌ నుంచి పంటల సాగు చేసేందుకు రైతులు మళ్లీ సమాయత్తమవుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 1.70 లక్షల ఎకరాల్లో వరి, 33 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 2 వేల ఎకరాల్లో పెసర పంటలు సాగు చేయగా, 2.02 లక్షల ఎకరాల్లో పత్తి, 15,550 ఎకరాల్లో మిర్చి పంటలు సాగు చేశారు. అయితే పత్తి, మిర్చి పంటలను సాగు చేసిన రైతులు మోట్లు నరకడం, పంట చేలను శుభ్రం చేయడం వంటి పనులు కొనసాగిస్తూ భూసారాన్ని పెంచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల వర్షాలు కురుస్తుండగా.. పంట చేలల్లో ట్రాక్టర్ల ఫ్లవ్‌లతో లోతుగా వేసవి దుక్కులు చేయడం వంటి పనులకు ఉపక్రమిస్తున్నారు. భూమిని 25–30 సెంటీమీటర్ల లోతు దున్నుకుంటే మంచి ఫలితాలను పొందొచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు.

వేసవి దుక్కులతో లాభాలు

వేసవిలోనే భూమిని లోతుగా దున్నడంతో వర్షాకాలంలో తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకి భూమి కోతకు గురికాకుండా చేస్తుంది. భూమి పైపొరలు తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. భూమిలో తేమశాతం పెరిగి, భూసారం వృద్ధి చెందుతుంది. పురుగులు, తెగుళ్లు, కలుపు నివారణ చేసుకోవచ్చు. దుక్కులు దున్నేముందు పొలంలో గొర్రెలు, మేకలు, పశువుల మందలు తోలడం వలన వాటి విసర్జన పదార్థాలు భూసారాన్ని పెంచుతాయి. పశువుల పెంటపోగు, కంపోస్టు ఎరువులు, చెరువులోని పూడిక మట్టి వేయడంతో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. పంటలు చేతికి వచ్చే ముందు ఎండు ఆకులు, చెత్త చెదారాన్ని కాల్చివేయకుండా వాటిని పొలంలోనే కలిసిపోయేలా దున్నితే ఎరువుగా మారుతుంది. కలుపు మొక్కలు పంటల దిగుబడిని తగ్గిస్తున్న నేపథ్యాన లోతుగా దున్నడంతో అవి నేలపైకి వచ్చి అధిక ఉష్ణోగ్రతలతో నశించి తదుపరి సాగుకు బెడద తగ్గే అవకాశాలు ఉంటాయి.

వేసవి దుక్కులతో మేలు

వానకాలం, యాసంగి సీజన్లలో పంటల సాగు పూర్తయిన తరువాత తప్పనిసరిగా పొలాన్ని దున్నాలి. లేకుండా పంటలకు నాశనం చేసే పురుగులు వృద్ధి చెందుతాయి. దుక్కులు చేసే ముందు పశువుల పెంట సేంద్రియ ఎరువులను వేస్తే పొలానికి మరింత బలం చేకూరి అధిక దిగుబడికి దోహదపడుతుంది.

– లావణ్య, ఏఓ, చర్ల

దుక్కులు దున్నకపోతే నష్టాలే..

యాసంగి పంటల కోతల తర్వాత భూమిని వదిలేస్తే కలుపు మొక్కలు, ఇతర గడ్డిజాతి మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువ లేకుండా చేసి భూసారాన్ని తగ్గిస్తాయి. భూమి లోపలి పొరల్లోని నీరు ఆవిరై పోతుంది. వేసవి దుక్కులు లేకుంటే తొలకరి వాన నీరు భూమిలోకి ఇంకకుండా పోతుంది. వర్షాలతో భూమి కోతకు గురవుతుంది. ఖాళీ భూముల్లో చీడపురుగులు భారీగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా రాబోయే పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

సాగుకు సమాయత్తం..!1
1/1

సాగుకు సమాయత్తం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement