బీజేపీ మండల అధ్యక్షుల నియామకం | - | Sakshi
Sakshi News home page

బీజేపీ మండల అధ్యక్షుల నియామకం

May 4 2025 6:48 AM | Updated on May 4 2025 6:48 AM

బీజేప

బీజేపీ మండల అధ్యక్షుల నియామకం

చుంచుపల్లి/దుమ్ముగూడెం/ఇల్లెందురూరల్‌ /పాల్వంచ రూరల్‌ : బీజేపీ పలు మండలాలకు అధ్యక్షులను నియమించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి శనివారం నియామక పత్రాలు అందజేశారు. అశ్వాపురం మండలానికి ఉమ్మా సుధాకర్‌ రెడ్డి, ఇల్లెందు మున్సిపాలిటీ పాసి సుచిత్ర, ఇల్లందు రూరల్‌ భట్టు రమేష్‌, కొత్తగూడెం మున్సిపాలిటీ సీలం విద్యాసాగర్‌, చుంచుపల్లి బలగం శ్రీధర్‌, పాల్వంచ టౌన్‌ రాపాక రమేష్‌, పాల్వంచ రూరల్‌ పాలోజు క్రాంతి కుమార్‌, అశ్వారావుపేట మెట్టా వెంకటేష్‌, దమ్మపేట పల్లపు వెంకటేశ్వరరావు, దుమ్ముగూడెం మండల అధ్యక్షుడిగా కండ్రపు త్రినాథ్‌ రెడ్డి నియమితులయ్యారు.

రేపు జాబ్‌ మేళా

కొత్తగూడెంఅర్బన్‌: ఈ నెల 5న ఎంపీడీఓ కార్యాలయంలో జాబ్‌ మేళా నిర్వహించనున్న ట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థకు చెందిన జిల్లాలోని బ్రాంచ్‌లలో 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలకు 98667 74459 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

నేడు చేకూరి కాశయ్య విగ్రహావిష్కరణ

చుంచుపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్‌ మాజీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే, గురుదక్షిణ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు చేకూరి కాశ య్య కాంస్య విగ్రహాన్ని ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించనున్నారు. కొత్తగూడెం జెడ్పీ కార్యాలయం వద్ద జరిగే ఈ కార్యక్రమానికి కొత్తగూడెం, ఇల్లెందు ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య తదితరులు హాజరుకానున్నారు.

భద్రత సూచనలు

పాటించాలి

సుజాతనగర్‌: విద్యుత్‌ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భద్రత సూచనలు పాటించాలని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ మహేందర్‌ అన్నారు. సుజాతనగర్‌ సబ్‌ డివిజన్‌ ఆధ్వర్యంలో స్థానిక రైతు వేదికలో విద్యుత్‌ భద్రతా వారోత్సవాలపై శనివారం నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో మాట్లాడారు. ఈ నెల 7 వరకు విద్యుత్‌ భద్రతా వారోత్సవాలు కొనసాగుతాయన్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా రైతులు విద్యుత్‌ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈదురు గాలులు, ప్రకృతి వైపరీత్యాలతో తెగిపడిన విద్యుత్‌ తీగలు, విరిగి పడిన స్తంభాలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. పంట పొలాల్లో కరెంట్‌ వైర్లు తెగితే విద్యుత్‌ సిబ్బంది దృష్టికి తీసుకు రావాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పువాటిల్లే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈలు రంగస్వామి, కృష్ణ, ఏడీఈ రవికుమార్‌, ఏఈలు కిషన్‌, సతీష్‌, తరుణ్‌, నరసింహరావు, సిబ్బంది పాల్గొన్నారు.

కార్మిక సంఘాలతో చర్చలు జరపాలి

ఖమ్మంమామిళ్లగూడెం: ఆర్టీసీలో సమ్మె ప్రకట న చేసిన నేపథ్యాన కార్మిక సంఘాలతో ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపాలని ఆర్టీసీ ఎస్‌డబ్లు్‌ఎఫ్‌ రాష్ట్ర ఉప ప్రధాన కార్యద ర్శి గడ్డం లింగమూర్తి, ఉపాధ్యక్షుడు ఎర్రంశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సమ్మె విషయమై స్పందించినందున, వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలన్నారు. వేతన సవరణలో లోపాలు, ఎరియర్స్‌ చెల్లింపు, మరో రెండు వేతనసవరణలు, ఉద్యో గ భద్రత, అధికారుల వేధింపులపై చర్యలు జరపాలని వారు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

నేడు నెట్‌బాల్‌

ఎంపిక పోటీలు

ఖమ్మంస్పోర్ట్స్‌: రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా సబ్‌ జూనియర్‌ నెట్‌బాల్‌ బాలబాలికల జట్ల ఎంపికకు ఆదివారం పోటీలు నిర్వహిస్తున్నట్లు నెట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షురాలు దీప్తి తెలిపారు. ఖమ్మంరూరల్‌ మండలం పెద్ద వెంకటగిరిలో ఈ పోటీలు జరుగుతాయని, ఆసక్తి ఉన్న వారు ఆధార్‌ కార్డుతో పాటు వయసు ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు ఎం.ఫణికుమార్‌ (91338 94967)ను సంప్రదించాలని తెలిపారు.

బీజేపీ మండల అధ్యక్షుల నియామకం1
1/1

బీజేపీ మండల అధ్యక్షుల నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement