రామయ్యకు పునర్వసు పట్టాభిషేకం | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు పునర్వసు పట్టాభిషేకం

Jun 1 2025 12:19 AM | Updated on Jun 1 2025 12:19 AM

రామయ్

రామయ్యకు పునర్వసు పట్టాభిషేకం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి శనివారం పునర్వసు నక్షత్రం సందర్భంగా పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా జరిపారు. అలాగే స్వామివారి మూలమూర్తులకు సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

2న సాంస్కృతిక కార్యక్రమాలు

భద్రాచలంటౌన్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 2న శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఎల్‌.రమాదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు చిత్రకూట మండపంలో ఈ వేడుకలు ఉంటాయని, కళాకారులు, కళాభిమానులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

పొగాకు రహిత

సమాజానికి కృషి చేయాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): పొగాకు రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్‌.సరిత అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులో శనివారం న్యాయమూర్తులు, న్యాయ శాఖ ఉద్యోగులు, కోర్టు డ్యూటీ పోలీసులతో ఈ మేరకు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పొగాకు వాడడంతో రోగాల బారిన పడుతున్నారని, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించారు. పొగాకు ఉత్పత్తులతో కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. పొగాకు, సిగరెట్‌, ఆల్కహాల్‌ వినియోగంతో గుండె జబ్బులు, నోటి, లంగ్‌ కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.కిరణ్‌కుమార్‌, రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి రవికుమార్‌, సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఎం.రాజమల్లు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పీవీడీ లక్ష్మి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఏఓ జె.కిరణకుమార్‌ పాల్గొన్నారు.

వైద్యులకు మంత్రి

దామోదర అభినందన

భద్రాచలంఅర్బన్‌ : భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎక్స్‌ ద్వారా అభినందనలు తెలిపారు. రెండు నెలల క్రితం పురుగుమందు తాగి ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందిన మడకం శిరీష అనే యువతి కోలుకోగా.. స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శుక్రవారం ఆమెను పరామర్శించడంతో పాటు వైద్యులు చూపిన శ్రద్ధ తదితర వివరాలు ఆరా తీశారు. కాగా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ కూడా యువతిని రక్షించిన ఏరియా ఆస్పత్రి వైద్యులను అభినందించారు. తాజాగా శనివారం మంత్రి రాజనర్సింహ తన ఎక్స్‌ అకౌంట్‌ ద్వారా డీసీహెచ్‌ఎస్‌ రవిబాబు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రామకృష్ణ, పల్మనాలజిస్ట్‌ జగదీశ్‌తో పాటు సిబ్బందిని అభినందించారు.

జీపీ కార్యదర్శే ట్రాక్టర్‌ డ్రైవర్‌!

దుమ్ముగూడెం: గ్రామపంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోగా పాలకవర్గాలు సైతం లేకపోవడంతో కార్యదర్శులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేయాలని ఉన్నతాఽధికారులు ఆదేశించారు. ఇందుకు అవసరమైన రాళ్లు, ఇసుక తీసుకొచ్చేందుకు జీపీల ట్రాక్టర్లు వినియోగిస్తున్నారు. కానీ దుమ్ముగూడెం మండలం నర్సాపురం జీపీ ట్రాక్టర్‌ డ్రైవర్‌కు జ్వరం వచ్చి శనివారం విధులకు హాజరు కాలేదు. దీంతో పంచాయతీ కార్యదర్శి యాకూబ్‌ ఇలా ట్రాక్టర్‌ డ్రైవర్‌గా మారాడు.

రామయ్యకు  పునర్వసు పట్టాభిషేకం1
1/2

రామయ్యకు పునర్వసు పట్టాభిషేకం

రామయ్యకు  పునర్వసు పట్టాభిషేకం2
2/2

రామయ్యకు పునర్వసు పట్టాభిషేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement