
మెరుగైన వైద్యం అందించడం బాధ్యత
సింగరేణి(కొత్తగూడెం): కార్మికులకు మెరుగైన వైద్యం అందించటం సింగరేణి బాధ్యతని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బుధవారం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఒక్కరోజు దీక్ష చేపట్టారు. దీనికి సంఘీభావం తెలిపిన అనంతరం సింగరేణి డైరెక్టర్ (పీపీ అండ్ పా) కె.వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నట్లు యాజమాన్యం చెప్పడం వాస్తవదూరమని, కార్పొరేట్ వైద్యం పేరుతో రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ కార్మికులకు సరైన వైద్యం అందడం లేదని ఆరోపించారు. కాగా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కూడా దీక్షకు మద్దతు పలికారు. మిరియాల రాజీరెడ్డి, కాపు కృష్ణ, సీతాలక్ష్మి, వీరభద్రయ్య పాల్గొన్నారు.
మున్సిపాలిటీ
కార్యాలయం బోర్డు మార్పు
పాల్వంచ: ద్వితీయ శ్రేణి పాల్వంచ మున్సిపాలిటీ కొత్తగూడెం కార్పొరేషన్లో కలిసి డివిజన్ కేంద్రంగా ఏర్పడింది. ఈ క్రమంలో మున్సిపాలిటీ కార్యాలయం బోర్డు కాస్తా కొత్తగూడెం కార్పొరేషన్ బోర్డుగా బుధవారం మార్చారు. ఇప్పటికే కార్పోరేషన్ పరిధిలో డివిజన్ల ఏర్పాటు శరవేగంగా జరుగుతుండగా కార్యాలయ బోర్డు సైతం కార్పొరేషన్ బోర్డుగా ఏర్పాటు కావడం గమనార్హం.
రాష్ట్రస్థాయి
అథ్లెటిక్స్ మీట్లో సత్తా
ఖమ్మం స్పోర్ట్స్: హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–10, 12 అథ్లెటిక్స్ పోటీల్లో ఖమ్మం జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రాక్లీస్ చేస్తున్న డి.లోహిత, సీహెచ్.లాస్య అండర్–10 విభాగంలో, అండర్–12 బాలికల విభాగంలో ఎం.భవిత, బి.రుత్విక, బాలుర అండర్–12లో డి.ఉపేక్షిత్ ఈ.వరుణ్ బహుమతులు సాధించారు. క్రీడాకారులను డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, సీనియర్ అథ్లెటిక్స్ కోచ్ ఎం.డీ.గౌస్, అథ్లెటిక్స్ అసోసిఇయేషన్ జిల్లా కార్యదర్శి ఎం.డీ.షఫీక్ అహ్మద్ బుధవారం అభినందించారు.

మెరుగైన వైద్యం అందించడం బాధ్యత

మెరుగైన వైద్యం అందించడం బాధ్యత