రామయ్యకు సువర్ణ పుష్పార్చన | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు సువర్ణ పుష్పార్చన

Jun 9 2025 7:05 AM | Updated on Jun 9 2025 7:07 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారికి ఆదివారం అంతరాలయంలో అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టా న్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు బారులుదీరారు.

పెద్దమ్మతల్లికి

విశేష పూజలు

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్‌ ద్వారా అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు అన్నప్రాసనలు, ఒడి బియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమాల్లో ఈఓ ఎన్‌.రజనీకుమారి, వేదుపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్‌ శర్మ పాల్గొన్నారు.

నేడు గిరిజన దర్బార్‌

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్‌ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్‌ ఆదివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే గిరిజన దర్బార్‌లో గిరిజనులు సమస్యలపై ఫిర్యాదులు అందజేయాలని పేర్కొన్నారు.

తొలిరోజు ఐసెట్‌ ప్రశాంతం

సుజాతనగర్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం తొలిరోజు ఆదివారం అబ్దుల్‌ కలాం ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన ఐఎస్‌ట్‌ ప్రశాంతంగా ముగిసింది. మొదటి షిఫ్ట్‌లో 118 మంది, రెండో షిఫ్ట్‌లోనూ 118 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.

తుమ్మల చెరువులో

పర్యాటకుల పాట్లు

అశ్వాపురం: మండల పరిధిలోని తుమ్మలచెరువు వద్ద బోటింగ్‌ వద్ద తగిన సౌకర్యాలు లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. చెరువు వద్ద రెండు చిన్న బోట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో జలవిహారం చేసేందుకు పర్యాటకులు గంటల తరబడి వేచి ఉండాల్సివస్తోంది. వసతి, తాగునీటి, చిన్న పిల్లలకు స్నాక్స్‌ వంటి సౌకర్యాలు కూడా లేవు. తుమ్మలచెరువు వరకు రహదారి కూడా సక్రమంగా లేదు. అధికారులు స్పందించి పర్యాటకులకు తగిన సౌకర్యాలు కల్పించాలని, పార్క్‌ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

రామయ్యకు  సువర్ణ పుష్పార్చన1
1/3

రామయ్యకు సువర్ణ పుష్పార్చన

రామయ్యకు  సువర్ణ పుష్పార్చన2
2/3

రామయ్యకు సువర్ణ పుష్పార్చన

రామయ్యకు  సువర్ణ పుష్పార్చన3
3/3

రామయ్యకు సువర్ణ పుష్పార్చన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement