అడవులను రక్షించుకుందాం | - | Sakshi
Sakshi News home page

అడవులను రక్షించుకుందాం

Jun 9 2025 7:05 AM | Updated on Jun 9 2025 7:05 AM

అడవులను రక్షించుకుందాం

అడవులను రక్షించుకుందాం

చండ్రుగొండ : పర్యావరణ పరిరక్షణ కోసం అడవులను రక్షించుకుందామని ఎస్పీ రోహిత్‌రాజు పేర్కొన్నారు. మండలంలోని బెండాలపాడు శివారు కనకగిరి అటవీ ప్రాంతాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. గుట్టలపైభాగంలో ఉన్న వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించి, పూజలు చేశారు. అనంతరం పర్యాటకుల కోసం గుట్టలపైభాగంలో ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్‌ను పరిశీలించారు. అనంతరం బ్యాంబో క్లస్టర్‌ను సందర్శించారు. వెదురు ఉత్పత్తులను తిలకించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అడవులను, అటవీ సంపదను కొల్లగొట్టేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, అందుకోసం పోలీసుశాఖ సహకారం అందిస్తుందని తెలిపారు. డీఎస్పీ అబ్దుల్‌ రెహమాన్‌, ఫారెస్టు రేంజర్‌ ఎల్లయ్య పాల్గొన్నారు.

ఎస్పీ రోహిత్‌రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement