ధాన్యం సేకరణ55,245 మెట్రిక్‌ టన్నులు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణ55,245 మెట్రిక్‌ టన్నులు

Jun 9 2025 7:07 AM | Updated on Jun 9 2025 7:07 AM

ధాన్య

ధాన్యం సేకరణ55,245 మెట్రిక్‌ టన్నులు

ఇంకా జమకాని బోనస్‌

క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. యాసంగిలో కొనుగోలు కేంద్రాల్లో సన్న రకం ధాన్యం 36,951 మెట్రిక్‌ టన్నులు, దొడ్డు రకం ధాన్యం 18,293 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. సన్నాలకు రూ.18.48 కోట్ల బోనస్‌చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు రూపాయి కూడా రైతుల ఖాతాల్లో జమ చేయలేదు.

2.31 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి..

జిల్లాలో యాసంగిలో రైతులు 77వేల ఎకరాల్లో వరి సాగు చేయగా 2.31 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసిది. ఇందులో 66,928 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యాన్ని నిర్దేశించింది. పీఏసీఎస్‌, జీసీసీ, డీఆర్‌డీఏ, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో 145 కొనుగోలు కేంద్రాలు నిర్వహించారు. 8,222 మంది రైతుల నుంచి రూ.127.80 కోట్ల విలువైన 55,245 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నారు. లక్ష్యానికి ఇంకా 11,683 మెట్రిక్‌ టన్నుల సేకరణ తగ్గింది. రూ.125.31 కోట్లను రైతులకు చెల్లించారు. అంతకుముందు యాసంగి సీజన్‌లో 67,970 మెట్రిక్‌ టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్దేశించుకుని, 2,302 మంది రైతుల నుంచి 13,708 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. కేంద్రాలను ఏప్రిల్‌ 4 నుంచి జూన్‌ 6 వరకు కొనసాగించినా ఈసారి కొనుగోలు ప్రక్రియ మాత్రం ఆలస్యంగా మొదలైంది. దీనికితోడు అకాల వర్షాలు కురవడంతో రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయించారు. కాగా ప్రభుత్వం ఏ గ్రేడ్‌ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2320, సాధారణ రకానికి రూ.2300 చొప్పున చెల్లించింది.

పొలాల వద్దే కొన్న వ్యాపారులు

ప్రైవేటు వ్యాపారులు కల్లాలు, ఇళ్ల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోని నిబంధనల కారణంగా కొందరు ప్రైవేటు వైపు మొగ్గు చూపారు. తేమశాతం 17 లోపు ఉండాలని, తాలు గింజలు, వ్యర్థాలు లేకుండా శుభ్రపరిచి తేవాలని నిబంధనలు విధించారు. తాలు, వ్యర్థాల పేరుతో క్వింటాల్‌కు ఐదు కేజీల చొప్పున తూకం ఎక్కువ వేశారు. దీంతో పచ్చి వడ్లనే ప్రైవేటులో విక్రయించడం మేలని రైతులు భావించారు. అయితే గతం కంటే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ భారీగా పెరిగింది.

లక్ష్యం స్వల్పంగా తగ్గింది

ఈ ఏడాది యాసంగిలో రూ.127.80 కోట్ల విలువైన ధాన్యం సేకరించాం. నిర్దేశిత లక్ష్యంలో స్వల్పంగానే తగ్గింది. మార్కెట్‌లో ధాన్యానికి అధిక ధర ఉండటం, ప్రభుత్వం నిర్దేశించినట్లు గ్రేడింగ్‌ చేయలేని రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయించుకున్నారు. సీడ్‌ వ్యాపారులతో ఒప్పందం చేసుకున్న కొందరు ఏపీలో అమ్మకాలు జరిపారు. –త్రినాథ్‌బాబు, పౌరసరఫరాల కార్పొరేషన్‌ డీఎం

జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. గత శనివారంతో కేంద్రాలను ఎత్తివేశారు. ఈ సీజన్‌లో లక్ష్యంలో సుమారు 82 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభించడం, వాతావరణ మార్పులతో అకాల వర్షాల కారణంగా కొందరు రైతులు మాత్రం వడ్లను ప్రైవేటు వ్యాపారులకు విక్రయించారు. దీంతో పౌరసరఫరాలశాఖ నిర్దేశించిన లక్ష్యం మేరకు ధాన్యం సేకరణ జరగలేదు. ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్‌ ప్రకటించినా ఇప్పటివరకు ఒక్క రైతు ఖాతాలో కూడా నగదు జమ కాలేదు. – పాల్వంచరూరల్‌

ధాన్యం సేకరణ55,245 మెట్రిక్‌ టన్నులు1
1/1

ధాన్యం సేకరణ55,245 మెట్రిక్‌ టన్నులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement