
ఉద్యోగాల గని.. సింగరేణి..
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో 1998లో నిలిచిపోయిన వారసత్వ ఉద్యోగాలను.. టీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో పునరుద్ధరించింది. ఏడేళ్లలో 18 వేల మంది వారసులకు ఉద్యోగాలు కల్పించింది. సుమారు 6 వేల మందికి ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారా ఉపాధి కల్పించింది. రోస్టర్ విధానం అమలులో భాగంగా 665 ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసింది. ప్రస్తుతం సింగరేణివ్యాప్తంగా 19 ఓపెన్కాస్ట్ గనులు, 23 భూగర్భ గనుల్లో 40 వేల మంది పర్మనెంట్ కార్మికులు, 2,400 మంది అధికారులు, 32 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఉత్పత్తి చేసిన బొగ్గు ద్వారా తెలంగాణతోపాటు మరో 7 రాష్ట్రాల్లో సుమారు 2 వేల పరిశ్రమల్లో సుమారు లక్ష మందికి ప్రత్యక్షంగా, మరో 2 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోందని అధికారులు చెబుతున్నారు.
డిపెండెంట్ల ద్వారా 18 వేలు
ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారా
6 వేల ఉద్యోగాలు
అంకితభావంతో పనిచేయాలి..
కొత్తగూడెం ఏరియాలో ఇప్ప టి వరకు 669 మందికి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశం కల్పించాం. అంకితభావంతో విధులు నిర్వర్తించాలి. సంస్థ అభివృద్ధికి కృషిచేయాలి. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిలో సగం మంది విధులకుగైర్హాజరవుతున్నారు. వీరు పద్ధతి మార్చుకోవాలి.
–శాలేంరాజు, ఏరియా జీఎం
సింగరేణిలో సౌకర్యాలు ఎక్కువ..
దేశంలో ఏ ఇతర బొగ్గు పరిశ్రమల్లో లేని సౌకర్యాలు సింగరేణిలోనే ఉన్నాయి. ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికీ 13 రకాల సదుపాయాలతోపాటు అనుకోని పరిస్థితుల్లో కార్మికుడు మృతి చెందితే రూ.కోటి ప్రమాద బీమాతోపాటు మ్యాచింగ్ గ్రాంట్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తున్నాం.
–జీవీ కిరణ్కుమార్,
జీఎం (కార్పొరేట్ వెల్ఫేర్)

ఉద్యోగాల గని.. సింగరేణి..

ఉద్యోగాల గని.. సింగరేణి..