
చెట్లు నరికితే కఠిన చర్యలు
● పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి ● కలెక్టర్ జితేష్ వి.పాటిల్
చుంచుపల్లి/పాల్వంచరూరల్: చెట్లు నరికితే కఠిన
చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశించారు. పాల్వంచ మండలం బస్వతారాకకాలనీ పంచాయతీ అర్బన్ పార్కులో, కొత్తగూడెంలోని అటవీశాఖ వన విహార్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా అటవీశాఖాధికారి జి.కిష్టాగౌడ్తో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. కొత్తగూడెంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సెంట్రల్ పార్క్లో ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత కార్యక్రమంలో, ఐఎంఏ హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెట్లను నరుకుతూ పోతే భవిష్యత్లో ఎలాంటి ఫలసాయం అందుబాటులో ఉండదన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. జిల్లా అటవీశాఖాధికారి కిష్టాగౌడ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా మానివేయాలన్నారు. అటవీ అభివృద్ధి సంస్థ కొత్తగూడెం డివిజన్ కార్యాలయంలో సీజీఎం వీవీ రెడ్డి, డీఎంలు చంద్రమోహన్, కవిత తదితరులు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాల్లో ఎఫ్డీఓ కట్టా దామోదర్రెడ్డి, కోటేశ్వరరావు, పర్యావరణ ఇంజనీర్ బి.రవీందర్, కేటీపీఎస్ చీఫ్ ఇంజనీర్లు శ్రీనివాసబాబు, ప్రభాకర్రావు, రేంజర్లు సురేష్, రవికిరణ్, ఏ.కరుణాకరాచారి, డిప్యూటీ రేంజర్లు, సెక్షన్ ఆఫీసర్లు, బీట్అధికారులు, సింగరేణి ఎన్విరాన్మెంట్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించాలి
మణుగూరు రూరల్: ప్రతీ ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించాలని సింగరేణి డైరెక్టర్(పిఅండ్పి, పా) కె.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. బంగ్లాస్ ఏరియాలో మొక్కలు నాటారు. అనంతరం ఏరియా అధికారులతో కలిసి ఓసీ–2 వ్యూపాయింట్కు చేరుకుని బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో, నివాస స్థలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు పెంచాలనన్నారు. ఏరియా జీఎం కార్యాలయ ఆవరణంలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇన్చార్జ్ జీఎం లక్ష్మీపతిగౌడ్ మొక్కలు నాటారు. అనంతరం వ్యాసరచన, క్విజ్ పోటీల విజేతలకు జ్ఞాపికలు, జూట్ బ్యాగులను అందజేశారు. ఈ కార్యక్రమాలల్లో ఎఫ్డీఓ సయ్యద్ మక్సూద్ మొహియుద్దీన్, జీఎంలు డి.వెంకటేశ్వర్లు, తిరుమలరావు, ఇతర అధికారులు శ్యాంసుందర్, ఆర్.శ్రీనివాస్, కేశవరావు, వెంకట్రావు, అనురాధ, మదన్నాయక్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

చెట్లు నరికితే కఠిన చర్యలు