
రామవరంలో 12 ఏళ్ల బాలుడు
కొత్తగూడెం రామవరంలో 12ఏళ్ల బాలుడు ఆడుకుంటుండగా కొంత కాలం క్రితం వీధికుక్క కరిచింది. తల్లిదండ్రులకు భయపడి బాలుడు ఇంట్లో చెప్పలేదు. ఫిబ్రవరిలో వర్షాలు కురిశాక బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తల్లిదండ్రులు ఆరా తీ యగా కుక్క కరిచిన విషయం చెప్పాడు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. స్థానిక ఆస్పత్రిలో, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. కుక్క కరవడంతో బాలుడు మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. కా గా రామవరంలోనే కాంట్రాక్టు కార్మికులుగా విధు లు నిర్వహించే ఒకే కుటుంబానికి చెందిన బాబా యి, కూతురు కూడా కుక్కకాటుకు గురయ్యారు.