పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తాం | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తాం

Jun 1 2025 12:19 AM | Updated on Jun 1 2025 12:19 AM

పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తాం

పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తాం

భద్రాచలం: పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి గిరిజన శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూళ్లన్నింటినీ అన్ని వసతులతో సిద్ధం చేస్తామని, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ అన్నారు. హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి గురుకులాల ప్రిన్సిపల్‌ సెక్రటరీ సీతాలక్ష్మి, ట్రైబల్‌ వెల్ఫేర్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ సర్వేశ్వర్‌ రెడ్డితో కలిసి గిరిజన సంక్షేమ ప్రత్యేక సెక్రటరీ శరత్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లు, మంచాలు, కిటికీలకు మెష్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం పీఓ రాహుల్‌ మాట్లాడుతూ.. పాఠశాలల పునఃప్రారంభం సమయానికి అన్ని వసతులతో విద్యార్థులకు స్వాగతం పలికేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీసీలో డీడీ మణెమ్మ, ఈఈ చంద్రశేఖర్‌, డీఈ హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

గిరిజన మ్యూజియంపై శ్రద్ధ వహించాలి..

గిరిజన మ్యూజియం అభివృద్ధికి మరింత శ్రద్ధ వహించాలని పీఓ రాహుల్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. శనివారం తన చాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మ్యూజియం అభివృద్ధికి కేంద్రం రూ.కోటి నజరానా ప్రకటించటం హర్షణీయమని అన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన ఈఈ చంద్రశేఖర్‌, ఏసీఎంఓ రమణయ్య, ఉద్యానవన శాఖ సిబ్బంది మాలి బాబురావులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్‌ డేవిడ్‌ రాజ్‌, గురుకులం ఆర్సీఓ అరుణ కుమారి, ఏఓ సున్నం రాంబాబు, ఏటీడీఓలు అశోక్‌ కుమార్‌, చంద్రమోహన్‌, రాధమ్మ, మేనేజర్‌ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఐటీడీఏ పీఓ రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement