ప్రాథమిక విద్యలో ఏఐ ప్రాముఖ్యత పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ప్రాథమిక విద్యలో ఏఐ ప్రాముఖ్యత పెంచాలి

Apr 24 2025 12:41 AM | Updated on Apr 24 2025 12:41 AM

ప్రాథమిక విద్యలో ఏఐ ప్రాముఖ్యత పెంచాలి

ప్రాథమిక విద్యలో ఏఐ ప్రాముఖ్యత పెంచాలి

డీఈఓ వెంకటేశ్వరా చారి

బూర్గంపాడు: ప్రాథమిక విద్యలో ఆర్టిిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ప్రాముఖ్యత పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరా చారి అన్నారు. అంజనాపురం ప్రాథమిక పాఠశాలలో అమలవుతున్న ఏఐ తరగతులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంజనాపురం పాఠశాల అభివృద్ధిలో జిల్లాలోనే ముందుందని తెలిపారు. పాఠశాల వాతావరణం, పరిసరాలు ఆహ్లాదకరంగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఏఐలో కూడా అంజనాపురం పాఠశాల జిల్లాలో అగ్రస్థానం సాధించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులు, నోట్‌ పుస్తకాలు అందించారు. ఐదో తరగతి పూర్తయిన విద్యార్థులకు వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం కిషన్‌రావు, ఉపాధ్యాయులు బాబూరావు, శంకర్‌, సునీత, పద్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement