
ప్రాథమిక విద్యలో ఏఐ ప్రాముఖ్యత పెంచాలి
డీఈఓ వెంకటేశ్వరా చారి
బూర్గంపాడు: ప్రాథమిక విద్యలో ఆర్టిిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రాముఖ్యత పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరా చారి అన్నారు. అంజనాపురం ప్రాథమిక పాఠశాలలో అమలవుతున్న ఏఐ తరగతులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంజనాపురం పాఠశాల అభివృద్ధిలో జిల్లాలోనే ముందుందని తెలిపారు. పాఠశాల వాతావరణం, పరిసరాలు ఆహ్లాదకరంగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఏఐలో కూడా అంజనాపురం పాఠశాల జిల్లాలో అగ్రస్థానం సాధించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు, నోట్ పుస్తకాలు అందించారు. ఐదో తరగతి పూర్తయిన విద్యార్థులకు వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం కిషన్రావు, ఉపాధ్యాయులు బాబూరావు, శంకర్, సునీత, పద్మ పాల్గొన్నారు.