
మామిడి రైతు విలవిల
● చీడపీడలు, కోతుల బెడదకు తోడు గాలి దుమారాలు ● చేతికందే దశలో పంట నేలపాలు
చండ్రుగొండ / అన్నపురెడ్డిపల్లి: మామిడి రైతులు విల్లవిల్లాడుతున్నారు. చీడపీడలు దాటుకుని అరకొరగా చేతికందే దశలో ఉన్న పంట గాలిదుమారాలు, వడగండ్ల వర్షాలతో నేలపాలవుతోంది. చండ్రుగొండ, అన్నపురెడ్డిపలి మండలాల్లో ఒకప్పుడు కళకళలాడిన మామిడితోటలు నేడు వెలవెలబోతున్నాయి. ఉమ్మడి చండ్రుగొండ మండలంలో పదేళ్ల క్రితం వరకు ఐదు వేల ఎకరాల్లో మామిడితోటలు ఉండగా ప్రస్తుతం రెండు వేల ఎకరాలకే పరిమితమైంది. దిగుబడి తగ్గడం, ప్రకృతి వైపరీత్యాలతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల వస్తున్న గాలిదుమారాలు, వర్షం, వడగండ్లతో ఒక్క అన్నపురెడ్డిపల్లి మండలంలోనే 400 ఎకరాల్లో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఉద్యాన శాఖాధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
పంటనష్టంపై నివేదిక ఇచ్చాం
పంటనష్టంపై ప్రభుత్వానికి నివేదిక పంపించాం. గత 15 రోజులుగా వస్తున్న గాలిదుమారాలతో అన్నపురెడ్డిపల్లి మండలంలో 400 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లింది.
– సందీప్, ఉద్యాన విస్తరణాధికారి

మామిడి రైతు విలవిల