ములకలపల్లి: వివిధ ఘటనల్లో అధికారులు సీజ్ చేసిన వాహనాలు అగ్గికి ఆహుతయ్యాయి. మండలకేంద్రంలోని పాత పోలీస్స్టేషన్ ఎదురుగా గెస్ట్హౌస్ సమీపంలో సుమారు పదేళ్లుగా స్వాధీనం చేసుకున్న వాహనాలను నిలిపి ఉంచారు. సోమవారం ఆ ప్రదేశంలో నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. మంటలు అంటుకుని వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. స్థానికులు, గ్రామపంచాయతీ సిబ్బంది వాటర్ ట్యాంకర్తో నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. కాగా పోలీస్ స్టేషన్ను నూతన ప్రదేశంలో మార్చిన క్రమంలో వాహనాలను కూడా అక్కడికి తరలిస్తే ముప్పు తప్పి ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు.