స్థానిక సంస్థల అదనపు కలెక్టర్,
మున్సిపల్ ప్రత్యేక అధికారి విద్యాచందన
ఇల్లెందు/ఇల్లెందురూరల్: జలశక్తి అభియాన్ పథకం కింద అతి తక్కువ ఖర్చుతో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి విద్యాచందన కోరారు. శనివారం ఇల్లెందు మున్సిపాలిటీలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని నీటి ఎద్దడి లేకుండా తగిన ప్రణాళిక రూపొందించాలని, నీటి ఎద్దడిపై ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసుకోవాలని కోరారు. ఇంటి పన్నులు వచ్చే 10 రోజుల్లో నూరు శాతం వసూలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో కమిషనర్ శ్రీకాంత్, మేనేజర్ అంకుషావలి, డీఈ మురళి, ఏఈ, ఏఓ, ఆర్ఐ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కాగా, మండలంలోని సుదిమళ్ల, సుభాష్నగర్లలో ఇంకుడు గుంతల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ విద్యాచందన తనిఖీ చేశారు. నెలాఖరు నాటికి ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. ఎంపీడీఓ ధన్సింగ్, ఎంపీఓ చిరంజీవి, ఏపీఓ శంకర్, పంచాయతీ కార్యదర్శులు రజినీకాంత్, అజహర్, సిబ్బంది పాల్గొన్నారు.