పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన | - | Sakshi
Sakshi News home page

పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన

Mar 14 2025 12:56 AM | Updated on Mar 14 2025 12:53 AM

పాల్వంచరూరల్‌ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి నివేదన, హారతి, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. ఆలయ ఈఓ ఎన్‌.రజనీకుమారి, వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.

బాలాజీ ఆలయంలో ధ్వజారోహణం

అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): అన్నపురెడ్డిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగతాయారు సమేత బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన గురువారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో పండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ స్వామివారికి సుప్రభాతసేవ, ఆరాధన, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్టి, చతుః స్థానార్చన, బలిహరణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఇన్‌చార్జ్‌ మేనేజర్‌ పాకాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

డైరెక్టర్‌(పా)గా

అదనపు బాధ్యతలు

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో డైరెక్టర్‌(ప్రాజెక్ట్‌ అండ్‌ ప్లానింగ్‌)గా విధులు నిర్వర్తిస్తున్న కొప్పుల వెంకటేశ్వర్లుకు డైరెక్టర్‌ (పా)గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ యాజమాన్యం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లును ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌, నాయకులు వంగా వెంకట్‌, రమణమూర్తి తదితరులు ఘనంగా సత్కరించారు.

నీళ్లు రాక ఎండుతున్న పొలాలు

పాల్వంచరూరల్‌: యాసంగిలో సాగుచేసిన వరి పొలాలకు నీళ్లు లేక తడారిపోతున్నాయని బాధిత రైతులు చెబుతున్నారు. మండలంలోని రెడ్డిగూడెంలోని రాళ్లవాగు ప్రాజెక్టు నీటిని నమ్ముకుని యాసంగిలో వరి సాగుచేశారు. రాళ్లవాగులో నీరు అడుగంటి తూము నుంచి రావడం లేదు. దీంతో ప్రాజెక్టు కింద సాగుచేసిన కనీసం బోర్లు, వ్యవసాయ బావులు లేని వరి పొలాలు సుమారు 50 ఎకరాలు బీటలువారి ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు, ఏఓ శంకర్‌, ఇరిగేషన్‌ ఏఈ రాథోడ్‌ గురువారం రాళ్లవాగు ప్రాజెక్టులోని నీరు, సాగునీరు అందక ఎండిపోతున్న వరి పొలాలను పరిశీలించారు.

16న అథ్లెటిక్స్‌

ఎంపిక పోటీలు

ఖమ్మం స్పోర్ట్స్‌: ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఈనెల 16న జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. అండర్‌–14, 16, 18, 20, పురుషులు మహిళల విభాగాల్లో 100, 400, జావెలిన్‌త్రో అంశాల్లో పోటీలు ఉంటాయని అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి ఎం.డీ.షపీక్‌ అహ్మద్‌ తెలిపారు. క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు.

పెద్దమ్మతల్లికి  సువర్ణ పుష్పార్చన1
1/3

పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన

పెద్దమ్మతల్లికి  సువర్ణ పుష్పార్చన2
2/3

పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన

పెద్దమ్మతల్లికి  సువర్ణ పుష్పార్చన3
3/3

పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement