నమ్మించి.. నట్టేట ముంచేసి.. | - | Sakshi
Sakshi News home page

నమ్మించి.. నట్టేట ముంచేసి..

Sep 24 2025 5:17 AM | Updated on Sep 24 2025 5:17 AM

నమ్మి

నమ్మించి.. నట్టేట ముంచేసి..

నమ్మించి.. నట్టేట ముంచేసి..

నాగులుప్పలపాడు: యాప్‌లో నగదు జమ చేస్తే భారీగా లాభం వస్తుందని నమ్మించి ఆ ఊరి ప్రజలను నట్టేట ముంచాడో ప్రబుద్ధుడు. సుమారు 500 మందికిపైగానే రూ.5 కోట్లకుపైగా చెల్లించి మోసపోయారు. ఆ వ్యక్తి ఊరిలో కనిపించకపోవడంతో విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నాగులుప్పలపాడు మండలంలోని తిమ్మసముద్రం గ్రామానికి చెందిన తూతిక నాగాంజనేయులు అనే వ్యక్తి ఎల్‌ఎఫ్‌ వర్క్‌ మనీ పేరుతో ఉన్న యాప్‌లో పెట్టుబడి పెడితే రూ.లక్షల్లో లాభాలు వస్తాయని ఆశ చూపించాడు. గ్రామంలోని సుమారు 500 మంది నుంచి రూ.5 కోట్లకుపైగా వసూలు చేసి అందులో చేర్పించాడు. యాప్‌ను ఈ ఏడాది జనవరిలో నాగాంజనేయులుకు ఒడిశాకు చెందిన కొందరు వ్యక్తులు పరిచయం చేశారు. ఎవరైనా డిపాజిట్‌ చేస్తే నగదును బట్టి రోజువారీగా కొంత మొత్తం తొమ్మిది నెలలపాటు ఇస్తారని నాగాంజనేయులు నమ్మించాడు. రూ.2,400 డిపాజిట్‌ చేస్తే రోజుకి రూ.72 చొప్పున, రూ.6,000 చెల్లిస్తే రోజుకి రూ.350 చొప్పున, రూ.12,000 చెల్లిస్తే రోజుకి రూ.725 చొప్పున ఇస్తామని చెప్పి ప్రజలకు అలవాటు చేసి మొదట్లో తిరిగి చెల్లింపులు కూడా చేశారు. ఆశావాహులు పెరిగారని నమ్మకం కుదిరిన తరువాత రూ.24 వేలు, రూ.51,100 వంటి పెద్ద మొత్తాలను కూడా డిపాజిట్‌ చేయొచ్చని నమ్మబలికారు. ఎల్‌ఎఫ్‌ వర్కు పేరుతో చీరాల, ఇంకొల్లు ప్రాంతాల్లో కార్యాలయాలు కూడా తెరిచారు. ఈ మధ్య కాలంలో చీరాలలోని ఓ రిసార్టులో ఆర్భాటంగా పెద్ద అవగాహన సభ ఏర్పాటు చేశారు. వచ్చిన క్‌లైంట్లకు భారీ విందు కూడా ఇచ్చారు. దీంతో నమ్మిన జనం ఆగస్టు చివరి వారం, సెప్టెంబర్‌ మొదటి వారాల్లో అందిన కాడికి అప్పులు తెచ్చి రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టారు. నాగాంజనేయులు ఈ సంస్థకు చీరాల ఏరియా మేనేజర్‌గా పరిచయం చేసుకోవడంతో తిమ్మసముద్రం గ్రామంతో పాటు చీరాల, వేటపాలెం, పర్చూరు, ఇంకొల్లు ప్రాంతాల ప్రజలు తమ బంగారాలను సైతం తాకట్టు పెట్టి ఈ యాప్‌లో పెద్ద మొత్తంలో జమ చేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి యాప్‌ ద్వారా డబ్బులు విత్‌డ్రా కావడం లేదు. నాగాంజనేయులు ఊరి విడిచి వెళ్లిపోవడంతోపాటు 2 రోజుల నుంచి అతని ఫోన్‌ పనిచేయడం లేదు. ఒక్కసారిగా గ్రామంలో అలజడి మొదలైంది. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో మంగళవారం గ్రామంలో విచారణ చేపట్టారు.

రూ.వేలల్లో పెట్టుబడి పెడితే లక్షాధికారులు అవుతారంటూ ప్రచారం

ఎల్‌ఎఫ్‌ వర్క్‌ మనీ యాప్‌ పేరుతో రూ.5 కోట్ల వరకు వసూలు

నిర్వాహకుడు ఊరు విడిచి వెళ్లడంతో వెలుగులోకి భారీ మోసం

నమ్మించి.. నట్టేట ముంచేసి.. 1
1/3

నమ్మించి.. నట్టేట ముంచేసి..

నమ్మించి.. నట్టేట ముంచేసి.. 2
2/3

నమ్మించి.. నట్టేట ముంచేసి..

నమ్మించి.. నట్టేట ముంచేసి.. 3
3/3

నమ్మించి.. నట్టేట ముంచేసి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement