రసవత్తరంగా విజ్ఞాన్‌ జాతీయ చెస్‌ చాంపియన్‌షిప్‌ | - | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా విజ్ఞాన్‌ జాతీయ చెస్‌ చాంపియన్‌షిప్‌

Sep 24 2025 5:17 AM | Updated on Sep 24 2025 5:17 AM

రసవత్తరంగా విజ్ఞాన్‌ జాతీయ చెస్‌ చాంపియన్‌షిప్‌

రసవత్తరంగా విజ్ఞాన్‌ జాతీయ చెస్‌ చాంపియన్‌షిప్‌

చేబ్రోలు: ఆల్‌ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తున్న 62వ జాతీయ చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో మంగళవారం రెండో రౌండ్‌ ముగిసేసరికి 68 మంది క్రీడాకారులు తలో రెండు పాయింట్లతో అగ్రస్థానాన్ని పంచుకున్నారు. ఎక్కువమంది అగ్ర క్రీడాకారులు మూడో రౌండ్‌కి సులభంగా అడుగుపెట్టారు. మాజీ జాతీయ చాంపియన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ సూర్యశేఖర్‌ గంగూలీ (పీఎస్‌పీబీ) టాప్‌ బోర్డులపై తొలి విజయాన్ని నమోదు చేశారు. గియూకో పియానో ఆరంభంలో, 19వ మూవ్‌లో యషద్‌ బంబేశ్వర్‌ (ఛత్తీస్‌గఢ్‌) చేసిన తప్పిదాన్ని గంగూలీ సద్వినియోగం చేసుకున్నారు. వరుసగా బిషప్‌, నైట్‌ త్యాగాలు చేసి పూర్తిగా ఆధిపత్యం సాధించిన గంగూలీ, 30వ మూవ్‌లో ప్రత్యర్థిని రాజీనామా చేయించారు.

– టాప్‌ సీడ్‌ జీఎం ఇనియన్‌.పి (తమిళనాడు), అధిరాజ్‌ మిత్రా(ఝార్ఖండ్‌)పై గెలుపొందాడు. వెటరన్‌ జీఎం కృష్ణన్‌ శశికిరణ్‌, హృషికేశ్‌ బానిక్‌ (పశ్చిమ బెంగాల్‌)పై గెలుపొందాడు. కొత్తగా గ్రాండ్‌మాస్టర్‌ బిరుదు పొందిన ఎస్‌.రోహిత్‌ కృష్ణ (తమిళనాడు), దేవర్ష భోర్కటేరియా (గుజరాత్‌)పై గెలుపొందాడు. జీఎం.ఎం.ఆర్‌.లలిత్‌ బాబు (ఆంధ్రప్రదేశ్‌), అయుష్‌ రవికుమార్‌ (తమిళనాడు)పై ఆసక్తికర పోరులో గెలిచారు. కర్ణాటక ఐఎం వియాని ఆంటోనియో డి కున్హాను ఆంధ్ర యువకుడు అందమాల హేమల్‌ వర్షన్‌ డ్రాలో కట్టేశారు. మూడో రౌండ్‌లో టాప్‌ బోర్డులపై మరింత రసవత్తర పోటీలు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement