దివంగత వైఎస్‌ పాలనలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు | - | Sakshi
Sakshi News home page

దివంగత వైఎస్‌ పాలనలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు

Sep 2 2025 7:12 AM | Updated on Sep 2 2025 7:12 AM

 దివం

దివంగత వైఎస్‌ పాలనలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు

దివంగత వైఎస్‌ పాలనలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు ● ఆరోగ్యశ్రీతో పేదలకు వైద్యం ● ఫీజు రీయింబర్స్‌తో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత చదువులు ● తీర ప్రాంత రైతులకు ఉచిత విద్యుత్‌ ● నిజాంపట్నంలో సునామీ బాధితులకు పక్కా గృహాలు ● విజయవాడ నుంచి రేపల్లె వరకు కృష్ణా కరకట్ట నిర్మాణం ● అద్దంకిలో జలయజ్ఞం కింద సాగునీటి పథకాలు ● రూ.1100 కోట్లతో మేదరమెట్ల– నార్కెట్‌పల్లి రహదారి ఏర్పాటు ● దివంగత నేత వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటున్న జిల్లావాసులు ● నేడు వాడవాడలా వర్ధంతి వేడుకలు అభివృద్ధికి‘మెచ్చు’ తునకలు ● వేమూరు నియోజకవర్గం చుండూరులో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు. జంపనిలో షుగర్‌ ఫ్యాక్టరీని టీడీపీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయగా, దివంగత వైఎస్‌ దాన్ని తిరిగి కో–ఆపరేటివ్‌ సెక్టార్‌లోకి తెచ్చారు. వీటితో పాటు నియోజకవర్గ అభివృద్ధికి పలు పథకాలు అమలు చేశారు. ● రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మండలం కొత్తపాలెంలో మత్స్యకారులు, ఎస్టీలకు 120 పక్కా గృహాలు నిర్మించారు. రూ. 222 కోట్లతో విజయవాడ నుంచి రేపల్లె వరకూ కృష్ణానది పొడవునా కరకట్టను నిర్మించారు. ● రూ. 15 కోట్లతో బాపట్ల సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు పరిధిలో ఫిల్టర్‌ బెడ్లు, పైపు లైన్లు నిర్మించారు. బాపట్లతో పాటు తీర ప్రాంతంలోని రైతులకు ఉచిత విద్యుత్‌ అందించడంతో రైతులు ఇసుక నేలల్లో మూడు పంటలు పండించుకుంటున్నారు. ● పర్చూరు నియోజకవర్గం కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రిని నిర్మించారు. చినగంజాం ప్రాంతంలో అధికంగా ఉన్న ఉప్పు రైతులకు రూ. 1.05కే విద్యుత్‌ అందించారు. ● చీరాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. రూ. 120 కోట్లతో చీరాల అభివృద్ధి, రూ.6 కోట్లతో హైలెవల్‌ బ్రిడ్జిలు నిర్మించారు. చేనేతల రుణాలు మాఫీచేసి అభయహస్తం అందించారు.

సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రత్యర్థులు సైతం శభాష్‌ అనిపించేలా పాలన సాగించిన దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబర్‌ 2న హెలికాప్టర్‌ ప్రమాదంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. భౌతికంగా దూరమైనా ఆయన ఇప్పటికీ తెలుగుజనం గుండెల్లో గుడి కట్టుకొన్నారు. ఆయన వారసుడిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గడచిన అయిదేళ్లు జనరంజక పాలన సాగించారు. అమ్మ ఒడి, రైతు భరోసా, ఉచిత పంటల బీమా, గిట్టుబాటు ధరలతో పాటు వందలాది సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందించి జనం మన్ననలు పొందారు.

పేదల గుండెల్లో గూడు కట్టుకున్న దేవుడు

పేదల గుండెల్లో గూడుకట్టుకున్న దేవుడు దివంగత వైఎస్‌.రాజశేఖరరెడ్డి వర్థింతి వేడుకలు మంగళవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి. ఇందుకోసం వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో దివంగతనేత విగ్రహాలకు క్షీరాభిషేకాలు నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అన్నదానాలు, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తారు. ఆస్పత్రుల్లో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేయనున్నారు. వాడవాడలా వైఎస్‌ వర్థంతి కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రె స్‌పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొననున్నారు.

బాపట్ల జిల్లా అభివృద్ధికి కృషి

జిల్లాకు వైఎస్‌ చేసిన మేలును జనం మరోమారు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన పాలనలో బాపట్ల ప్రాంత అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. అద్దంకి ప్రాంత అభివృద్ధి కోసం పెద్దఎత్తున పనులు చేపట్టారు. జలయజ్ఞంలో భాగంగా రూ. 70 కోట్లతో భవనాశి రిజర్వాయర్‌, రూ. 175 కోట్లతో ఎర్రం చినపోలిరెడ్డి పథకంతో పాటు కొరిశపాడు ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. రూ. 1100 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో మేదరమెట్ల నుంచి నార్కెట్‌పల్లి వరకూ జాతీయరహదారిని నిర్మించారు. ఒంగోలు ప్రాంతంనుంచి హైదరాబాద్‌కు దగ్గర దారిని ఏర్పాటు చేసిన ఘనత దివంగత నేత వైఎస్‌దే.

 దివంగత వైఎస్‌ పాలనలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు 1
1/1

దివంగత వైఎస్‌ పాలనలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement