
తైక్వాండో పోటీల్లో బాలిక సత్తా
చీరాల రూరల్: జాతీయస్థాయి తైక్వాండో చాంపియన్ షిప్ పోటీల్లో చీరాల వెదుళ్లపల్లికి చెందిన రాజు ఆకాంక్షరెడ్డి 29 కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించింది. ఫస్ట్ ఫెడరేషన్ కప్ సీపీయూ తైక్వాండో జాతీయస్థాయి చాంపియన్ షిప్–2025 పోటీలు గతనెల 30న డివిజనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నాసిక్లో నిర్వహించారు. చీరాల తైక్వాండో కోచ్ మల్లెల సురేష్ ఆధ్వర్యంలో శిక్షణ పొంతుతున్న బాపట్లలోని జేమ్స్ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్న వెదుళ్లపల్లికి చెందిన రాజు ఆకాంక్ష రెడ్డి 29 కేజీల విభాగంలో పాల్గొంది. తన ప్రత్యర్థిని చిత్తుచేసి బ్రాంజ్ మెడల్ కై వసం చేసుకుంది. మన రాష్ట్రంతోపాటు చీరాల ప్రతిష్టను ఇనుమడింపచేసింది. కోచ్ సురేష్ ఆధ్వర్యంలో క్రీడాకారిణి ఆకాంక్ష రెడ్డి చీరాల ఒన్టౌన్ సీఐ సుబ్బారావును శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆకాంక్ష రెడ్డి, కోచ్ సురేష్ను మెమోంటో అందజేసి ఘనంగా సత్కరించారు. అంతేకాక పలువురు క్రీడాభిమానులు, క్రీడా ప్రేమికులు వారిని అభినందించారు.