
సేద్యం విభాగంలో హోరాహోరీ పోరు
వేటపాలెంకి చెందిన ఎడ్ల జతకు ప్రథమ బహుమతి
దాచేపల్లి: స్థానిక శ్రీ వీర్ల అంకమ్మతల్లి కొలుపుల తిరునాళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు బుధవారం హోరాహోరీగా జరిగాయి. సేద్యం విభాగంలో జరిగిన ఎడ్ల బల ప్రదర్శన పోటీలో బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకి చెందిన అత్తోట శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్లజత 5,122 అడుగుల దూరం బండలాగి విజేతగా నిలిచాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడుకి చెందిన గరికపాటి లక్ష్మయ్య చౌదరి ఎడ్లజత 4,757 అడుగుల దూరం బండలాగి రెండవస్థానం, పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఉయ్యందంకి చెందిన సంపటం వీరబ్రహ్మాం నాయుడు ఎడ్లజత 4,750 అడుగుల దూరంబండలాగి మూడవస్థానం, సూర్యపేట జిల్లా కోదాడ మండలం కోదాడకి చెందిన షేక్ హుస్సేన్, హుజూర్నగర్కి చెందిన జక్కుల సహస్రయాదవ్ సంయుక్త ఎడ్లజత 4,644 అడుగుల దూరం బండలాగి నాల్గవస్థానం, కృష్ణ జిల్లా తోటవల్లూరు మండలం చినపులిపాకకి చెందిన ఆర్వీఎస్ బుల్స్, పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెంకి చెందిన యామిని మోహన్శ్రీ సంయుక్త ఎడ్లజత 4,250 అడుగుల దూరంబండలాగి ఐదవస్థానం, ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మర్రివేములకి చెందిన సిద్ధి మల్లేశ్వరి ఎడ్లజత 3,914 అడుగుల దూరంబండలాగి ఆరవస్థానంలో నిలిచాయి. విజేతలైన ఎడ్ల జతల రైతులకు నగదు, షీల్డ్స్ని దాతలు బహూకరించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా గూడా శ్రీనివాసరావు వ్యవహరించారు. కమిటీ సభ్యులు కొప్పుల గిరి, అనిశెట్టి శ్రీనివాసరావు, మునగా నిమ్మయ్య, కానుకొల్లు ప్రశాంత్ పోటీలను పర్యవేక్షించారు.