
ముసామీన్
ప్రత్తిపాడు: ఆర్టీసీ బస్సులో ఓ మహిళ తో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ కథనం.. మండలంలోని పాతమల్లాయపాలెం ఎస్సీ కాలనీకి చెందిన మహిళ మంగళవారం రాత్రి గుంటూరు నుంచి ప్రత్తిపాడు బస్సులో వస్తున్నారు. అదే బస్సులో చేబ్రోలు మండలం వేజెండ్లకు చెందిన షేక్ ముసామీన్ కూడా ఎక్కాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.
మహిళ, తోటి ప్రయాణికులు కూడా మహిళకు మద్దతుగా నిలిచారు. ముసామీన్ ప్రయాణికులపైనా అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో మహిళ విషయాన్ని ఫోన్ ద్వారా తన బంధువులకు తెలియజేసింది. ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అనంతరం ప్రత్తిపాడు పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లి అప్పగించారు. కేసు నమోదు చేయనున్నట్లు ప్రత్తిపాడు ఎస్ఐ డి.రవీంద్రబాబు తెలిపారు.