కదిలే రైలు ఎక్కబోతుండగా ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

కదిలే రైలు ఎక్కబోతుండగా ప్రమాదం

Jun 21 2023 1:02 AM | Updated on Jun 21 2023 11:12 AM

చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు మహేంద్ర విష్ణుభగత్‌  - Sakshi

చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు మహేంద్ర విష్ణుభగత్‌

చీరాల రూరల్‌: మంచినీళ్ల కోసం రైలుదిగిన ప్రయాణికుడు ఆ రైలు కదలడంతో పరుగున వెళ్లి ఎక్కబోతుండగా జారిపడటంతో తీవ్రగాయాలపాలయ్యాడు. ఈఘటన మంగళవారం సాయంత్రం చీరాల రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్‌ఐ సీహెచ్‌ కొండయ్య వివారల మేరకు.. మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన మహేంద్ర విష్ణుభగత్‌ అనే వ్యక్తి నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్నాడు.

రైలు చీరాల రైల్వేస్టేషన్‌లో కొద్దిసేపు ఆగింది. దీంతో భగత్‌ మంచినీరు తెచ్చుకునేందుకు రైలుదిగాడు. ఈ క్రమంలో రైలు ప్లాట్‌ఫాం నుంచి బయలు దేరడం గమనించిన అతను పరుగున వెళ్లి రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. అయితే అతని రెండు చేతులు పట్టు తప్పడంతో రైలుకు ప్లాట్‌ఫాంకు మధ్యలోకి వెళ్లిపోయాడు. గమనించిన తోటి ప్రయాణికులు రైలు చైన్‌ లాగడంతో పాటు ప్లాట్‌ఫాంపై ఉన్న ఆర్పీఎఫ్‌, జీఆర్పీ పోలీసులు తక్షణమే స్పందించి లోనికి జారిపోతున్న బాధితుడిని ప్లాట్‌ఫాంపైకి లాగి ప్రాణాలు రక్షించారు.

అప్పటికే అతని రెండు చేతులు ప్లాట్‌ఫాంకు రైలుబోగికి మధ్యలో ఇరుక్కుపోవడంతో రెండు చేతులు మణికట్టుల వరకు చర్మం ఊడిపోయి తీవ్ర రక్తగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది బాధితుడిని చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement