
గంగమ్మకు బోనాలు
మండలంలోని అనంతపురం గ్రామంలో వెలసిన శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. పూజారులు చెల్లు గంగయ్య సురేంద్ర కుటుంబ సభ్యులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. కుంకుమార్చన జరిపారు. భక్తులు బోనాలు సమర్పించారు. గంగమ్మా.చల్లంగా చూడమ్మా అని వేడుకున్నారు.కొందరు తలనీలాలు అర్పించారు. ఆలయ ప్రత్యేకాధికారి శ్రీనివాసులు వారి సిబ్బందితో ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారి అమ్మవారి విశిష్టతను పూజారులు వివరించారు. అలాగే మద్దిరేవుల గ్రామం, వంకగడ్డ రాచపల్లి సమీపంలో వెలసిన శ్రీశ్రీ మారెమ్మ దేవత అమ్మవారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. –లక్కిరెడ్డిపల్లి