ఆర్టీపీపీలో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

ఆర్టీపీపీలో ఉద్రిక్తత

Sep 23 2025 7:35 AM | Updated on Sep 23 2025 7:35 AM

ఆర్టీపీపీలో ఉద్రిక్తత

ఆర్టీపీపీలో ఉద్రిక్తత

ఎర్రగుంట్ల : డాక్టర్‌ ఎంవీఆర్‌ రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో సోమవారం ఏపీఎస్సీ జేఏసీ, టీఎన్‌వీకేఎస్‌, బీఎంఎస్‌ యూనియన్ల మధ్య తోపులాట జరిగింది. కొంచెం సేపు ఉద్రిక్త చోటు చేసుకుంది. పోలీస్‌, విజిలెన్స్‌, ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని ఇరువురు వర్గాల వారితో మాట్లాడి సర్దిచెప్పారు. విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ నిరసనలు, రిలే దీక్షలు చేసి సోమవారం ఫౌంటెయిన్‌ వద్ద నుంచి ర్యాలీ చేపట్టింది. అదే సమయంలో ప్రభుత్వంలో భాగమైన టీఎన్‌వీకేఎస్‌, బీఎంఎస్‌ యూనియన్లు కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంట్రాక్ట్‌ కార్మికుల కోసం నిరసనలు చేపట్టి సోమవారం రిలే దీక్షలు ప్రారంభించి గేటు బయట ఽఆందోళన చేసింది. జేఏసీ ర్యాలీ అనంతరం ఉద్యోగ, కార్మికులు విధులకు వెళ్తుండుగా, గేటు బయట టీఎన్‌వీకేఎస్‌, బీఎంఎస్‌ యూనియన్లు విధులకు పోకుండా అడ్డుకుంది. దీంతో ఒక్కసారిగా జేఏసీ, ఆ రెండు యూనియన్ల మధ్య తొపులాట జరిగింది. ఈ తోపులాటలో జేఏసీకి చెందిన ఓ ఉద్యోగి చొక్కా చినిగింది. అక్కడే ఉన్న పోలీసులు సర్దిచెప్పారు. అనంతరం జేఏసీ నాయకులు ఆర్టీపీపీ సీఈ ని కలిసి వినతి పత్రం అందించారు.

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

కడప కోటిరెడ్డి సర్కిల్‌ : ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంక్‌ రైతులకు వ్యవసాయ పనిముట్లకు రుణాలను ఇస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంక్‌ రాజంపేట రీజినల్‌ మేనేర్‌ సుశాంత్‌ కుమార్‌ స్వరూప్‌, కడప ఆర్‌ఎం శ్రీనివాస ప్రసాద్‌, ఎల్‌డీఎం జనార్ధనం తెలిపారు. సోమవారం కడపలోని జాన్‌డీర్‌లో నర్సిరెడ్డి, శివకుమార్‌లకు నూర్పిడి యంత్రాలను అందజేశారు. డీఆర్డీఏ డీపీఎం రఘునాథరెడ్డి, రాజంపేట ప్రాంతీయ కార్యాలయ సీపీసీ మనోజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement