
ఊరికి దారి దొరికింది.. ఉపకారికి బిల్లు దక్కలేదు !
ప్రకృతి వ్యవసాయ
ఉత్పత్తులతో ఆరోగ్య పరిరక్షణ
రాయచోటి జగదాంబసెంటర్ : ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతో ఆరోగ్య పరిరక్షణ లభిస్తుందని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వెంకటమోహన్ తెలియజేశారు. సోమవారం రాయచోటి పట్టణంలోని ఏడీ త్యాగరాజు రైతు బజార్లో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రత్యేక స్టాల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు ప్రకృతి వ్యవసాయ కూరగాయల వినియోగం వలన కలిగే లాభాలను వివరించారు. అనంతరం డీపీఎం వెంకటమోహన్ మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుమందులు లేకుండా ప్రకృతి విధానంలో పండే కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, అవి తినడం వలన రోగనిరోధకశక్తి పెరుగుతందని తెలిపారు. అదే విధంగా ప్రకృతి వ్యవసాయంతో తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో పవన్, పద్మావతి, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
వీరభద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి కృషి
చాపాడు : వైఎస్సార్ కడప జిల్లా అల్లాడుపల్లె శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి కోసంకృషి చేస్తానని ఆలయ ఈఓ శంకర్ బాలాజీ తెలిపారు. మండలంలోని అల్లాడుపల్లె శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ఈఓగా శంకర్ బాలాజీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పెరుగు వీరనారాయణ యాదవ్తో కలిసి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
మొగమూరు వంక ప్రవాహంతో ఇబ్బందులు పడేవారం. గ్రామానికి రాకపోకల కోసం వంతెన ని ర్మాణం చేపట్టడం ఆనందంగా ఉంది. వంతె న నిర్మాణానికి రూ. 57 లక్షలు మంజూరైంది. వంతెన నిర్మాణం పూర్తయి రాకపోకలు సాగుతున్నాయి. ఎన్నికల కోడ్ రావడంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో బిల్లుల మంజూరుకు ఆటంకం ఏర్పడింది.తర్వాత వచ్చిన కూటమి సర్కార్ బిల్లులు చెల్లించకుండా కాలాయాపన చేస్తోంది. దీంతో కోర్టు మెట్లు ఎ క్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
– బత్తల వీరయ్య యాదవ్,
మాజీ ఎంపీపీ, ఓబుల్రెడ్డిపల్లె
కడప సిటీ : ఆ గ్రామం ఏర్పడి 200 సంవత్సరాలు పైబడి అయ్యింది. రాకపోకలకు గ్రామసమీపాన ఉన్న మొగమూరు వంక ప్రవాహంతో సమస్యలు తీవ్రతరంగా ఉండేవి. ఈ వంక పెద్ద ఎత్తున ప్రవహిస్తే మూడు రోజుల వరకు అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయేవి. ఈ సమయంలో ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే మృతదేహాలను వంకలో ప్రవహించే నీటిలోనే వదిలేసే దుస్థితి. ఆ గ్రామంలో చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ వంక ప్రవాహం పెద్ద ఆటంకంగా మారి చదువులు కుంటుపడేవి. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అప్పటి ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి చొరవతో ఆ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ బత్తల వీరయ్య యాదవ్ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఆ గ్రామానికి ఉన్న సమస్యలన్నీ తీరిపోయాయి. ఇది ఎక్కడో మారుమూల పల్లె కాదు... వైఎస్సార్ కడప జిల్లాలోని మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెకు అతి దగ్గరలో ఉన్న ఓబుల్రెడ్డిపల్లె.
200 సంవత్సరాలుగా ఉన్న సమస్య
ఓబుల్రెడ్డిపల్లె గ్రామం ఏర్పడి 200 సంవత్సరాలకు పైగా అయ్యింది. అప్పటి నుంచి 2023 వరకు ఆ గ్రామ సమీపంలోని మొగమూరు వంక ప్రభావంతో వర్షాకాలంలో అన్ని విధాలుగా ఇబ్బందులు ఉండేవి. అప్పటి నుంచి 2022 వరకు ఆ గ్రామ సమస్యను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రధాన రహదారికి దగ్గరలో ఉన్న గ్రామమైనప్పటికీ ఏ నాయకులు వారి సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపలేదు.
పద్మవ్యూహంలాంటిది
ఈ వంక వస్తే ఓబుల్రెడ్డిపల్లె వాసులకు అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు ఉండేది. అటు పాలగిరికి వెళ్లి మెయిన్రోడ్డుకు వచ్చేందుకు యేరు అడ్డు పడేది. నాగూరు మీదుగా వెళ్లి వేంపల్లెకు వెళ్లాలంటే పాములూరు వంక అడ్డుగా ఉండేది. ఈ వంక ప్రవాహం వస్తే ఎటువంటి రాకపోకలకు అవకాశమే లేదు. వంక ప్రవాహం తగ్గినంత వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది.
గొర్రెల కాపరులకు తప్పిన ప్రమాదం
2022 నవంబరులో ఓబుల్రెడ్డిపల్లె సమీపాన ఉన్న వంక ఉధృతంగా ప్రవహించిన పరిస్థితి. ఆ సమయంలో తండ్రీ కొడుకులు ఆవుల ఎర్రన్న యాదవ్, బాల మునీంద్రయాదవ్లు వంకకు పైన తమకు చెందిన గొర్రెలు ఉండటంతో అక్కడికి చేరుకునేందుకు వంకను దాటాలని ప్రయత్నించారు. కాకపోతే ప్రవాహం ఉధృతంగా ఉండటంతో నీళ్లలో కొట్టుకుని పోతుండగా, ఒక కంపచెట్టును ఆశ్రయించి ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ విషయాన్ని గ్రామస్తులు గమనించి అప్పటి ఎంపీపీ బత్తల వీరయ్య యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి దృష్టికి ప్రమాద ఘటన గురించి తెలియజేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి బోట్ల సాయంతో తండ్రీకొడుకులను ప్రాణాలతో రక్షించారు.
వంక వస్తే అంత్యక్రియలకు ఆటంకం
ఓబుల్రెడ్డిపల్లెకు గ్రామ పరిసరాల్లో ఉన్న మొగమూరు వంక వర్షాకాలంలో అన్ని రకాల ఇబ్బందులను కలగజేస్తున్న పరిస్థితి. ఒక్కొక్కసారి ఈ వంక భారీ స్థాయిలో వర్షాలు కురిసినపుడు మూడు, నాలుగు రోజుల వరకు ప్రవాహం తగ్గే పరిస్థితి ఉండదు. అలాంటి సమయంలో గ్రామంలో ఎవరైనా మృతి చెందితే వంకను దాటేందుకు వీలుగాక వంకనీళ్లలోనే మృతదేహాలను వదిలి అంత్యక్రియలను పూర్తి చేయాల్సిన దుస్థితి నెలకొనేది.
చదువులకు తప్పని తిప్పలు
గ్రామంలో కేవలం 5వ తరగతి వరకే చదువుకునే వీలుంది. వర్షాకాలంలో అక్కడున్న వంక ప్రవాహంతో పై చదువులు చదివేందుకు తీవ్ర ఇబ్బందులు ఉండేవి. 5వ తరగతి తర్వాత 6వ తరగతి నుంచి పై తరగతులకు చదువుకునేందుకు వెళ్లేందుకు వేంపల్లె, వీరపునాయునిపల్లెకు వెళ్లాల్సి ఉంటుంది. వంక ప్రవాహం వల్ల చదువులకు తప్పని తిప్పలు కొనసాగేవి. చదువులు కుంటుపడేవి.
కోర్టు మెట్లెక్కిన కాంట్రాక్టర్
ఊరి మేలు కోసం వంతెన నిర్మాణం చేపట్టిన వీరయ్య యాదవ్ ఎన్నిమార్లు విన్నవించినా కూటమి ప్రభుత్వం బిల్లుల మంజూరు విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ చివరకు ఒక్కపైసా కూడా చెల్లించకుండా మాటలతోనే సరిపెట్టారు. ఈ నేపధ్యంలో వీరయ్య యాదవ్ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తే ఎక్కడ వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో బిల్లులకు ఎగనామం పెట్టినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పక్క నపెట్టి గ్రామ సమస్యను తీర్చేందుకు చేపట్టిన వంతెన నిర్మాణానికి కూటమి ప్రభుత్వం బిల్లు లు చెల్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
200 సంవత్సరాలుగా ఉన్న సమస్య
వంక వస్తే అంత్యక్రియలకు ఆటంకం
వంక నీళ్లలోనే మృతదేహాలను
వదిలేసే దుస్థితి
చదువులకూ తప్పని తిప్పలు
వైఎస్ జగన్ హయాంలో
వంతెన నిర్మాణం
తొలగిన అన్ని ఇబ్బందులు
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
బిల్లులు మంజూరు కాకపోవడంతో కోర్టు మెట్లెక్కిన వైనం

ఊరికి దారి దొరికింది.. ఉపకారికి బిల్లు దక్కలేదు !