
నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం
రాయచోటి జగదాంబసెంటర్ : కూటమి ప్రభుత్వం చేసే అవినీతి పనులపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీన కలెక్టర్కు వినతిపత్రం సమర్పించే కార్యక్రమం ఉంటుందని రాయచోటి నియోజకవర్గ పంచాయతీ విభాగం ప్రెసిడెంట్ మాసన వెంకటరమణ, రాష్ట్ర పంచాయతీ విభాగం సెక్రటరీ గాలివీటి ప్రవీణ్రెడ్డిలు తెలిపారు. ఈ మేరకు వారు ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయించాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ చట్టం మేరకు ఉపాధి హామీ పనులు గ్రామ పంచాయతీల ద్వారానే జరిపించాలని కూలీలకు సకాలంలో బిల్లులు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం జనరల్ సెక్రటరీ సూరం వెంకటసుబ్బారెడ్డి, మేధావుల ఫోరం రాయచోటి నియోజకవర్గ అధ్యక్షుడు జానం రవీంద్ర, చిట్లూరు సర్పంచ్ రామాంజులు, వైఎస్సార్సీపీ నాయకులు పేయల శివశంకర్, సంజీవయ్య, హజరత్ ఖాదర్వలీ తదితరులు పాల్గొన్నారు.