నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం | - | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం

Jun 30 2025 4:09 AM | Updated on Jun 30 2025 4:09 AM

నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం

నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం

రాయచోటి జగదాంబసెంటర్‌ : కూటమి ప్రభుత్వం చేసే అవినీతి పనులపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీన కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించే కార్యక్రమం ఉంటుందని రాయచోటి నియోజకవర్గ పంచాయతీ విభాగం ప్రెసిడెంట్‌ మాసన వెంకటరమణ, రాష్ట్ర పంచాయతీ విభాగం సెక్రటరీ గాలివీటి ప్రవీణ్‌రెడ్డిలు తెలిపారు. ఈ మేరకు వారు ఆదివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయించాలన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ చట్టం మేరకు ఉపాధి హామీ పనులు గ్రామ పంచాయతీల ద్వారానే జరిపించాలని కూలీలకు సకాలంలో బిల్లులు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం జనరల్‌ సెక్రటరీ సూరం వెంకటసుబ్బారెడ్డి, మేధావుల ఫోరం రాయచోటి నియోజకవర్గ అధ్యక్షుడు జానం రవీంద్ర, చిట్లూరు సర్పంచ్‌ రామాంజులు, వైఎస్సార్‌సీపీ నాయకులు పేయల శివశంకర్‌, సంజీవయ్య, హజరత్‌ ఖాదర్‌వలీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement