
బైకుతో హోంగార్డును ఢీకొన్న మైనర్ బాలుడు’
కలికిరి : వాహనాల తనిఖీలలో భాగంగా వాహనాన్ని ఆపిన హోంగార్డును మైనర్ బాలుడు బైకుతో ఢీకొని వెళ్లిపోయాడు. దీంతో హోంగార్డుకు కుడి కాలు విరిగింది. పోలీసుల కథనం మేరకు.. కలికిరి పట్టణ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో హోంగార్డు చింతల ప్రతాప్ రెడ్డి వాహనాలను ఆపుతున్నాడు. అటుగా వచ్చిన మైనర్ బాలుని వాహనాన్ని ఆపాడు. అతను ఆపకుండా హోంగార్డును ఢీకొని వెళ్లాడు. ప్రమాదంలో హోంగార్డుకు వాహనం తగిలి కిందపడ్డాడు. కాలు విరిగి గాయాలపాలయ్యాడు. దీంతో పోలీసులు అతన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికి త్స అనంతరం తిరుపతికి రెఫర్ చేశారు. ఈ మేరకు మైనర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హెడ్కానిస్టేబుల్ మదనమోహన్ రెడ్డి తెలిపారు.