
ఆటో ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
పులివెందుల రూరల్ : పట్టణంలోని ముద్దనూరుకు వెళ్లే రోడ్డులో ఆదివారం సాయంత్రం ఆటో ఢీకొని రోడ్డుపై కాగితాలు ఏరుకునే గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.. పోలీసులకు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తొండూరు మండలం క్రిష్ణంగారిపల్లె గ్రామానికి చెందిన బాలాజి పాల డెయిరీ ఆటో పులివెందులకు ప్రయాణికులను ఎక్కించుకుని వస్తుండగా ముద్దనూరు రోడ్డు సమీపంలోని హనుమాన్ గోల్డెన్ సిటీ వద్ద రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి (57) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న షబానా, శంషాద్లకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో పులివెందుల సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.