●చిత్తశుద్ధి లేకపోవడంతోనే పేలవంగా మహానాడు | - | Sakshi
Sakshi News home page

●చిత్తశుద్ధి లేకపోవడంతోనే పేలవంగా మహానాడు

May 29 2025 12:12 AM | Updated on May 29 2025 12:12 AM

●చిత్తశుద్ధి లేకపోవడంతోనే పేలవంగా మహానాడు

●చిత్తశుద్ధి లేకపోవడంతోనే పేలవంగా మహానాడు

కడపలో నిర్వహిస్తున్న మహానాడుకు రెండో రోజు పూర్తిగా ఆదరణ కరవయ్యింది. మొదటి రోజు అంతంత మాత్రంగా హాజరైన తెలుగు తమ్ముళ్లు, రెండు రోజు పూర్తిగా ముఖం చాటేశారు. మహానాడు ప్రాంగణం వైపే చూడని వారు కొందరైతే, వచ్చిన వారు కూడా ప్రసంగాలు ప్రారంభం కాగానే తిరుగుబాట పట్టారు. వెరసి మహానాడు ప్రాంగణం, చుట్టుపక్కల రహదారులన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. ఎంతో ఆర్భాటంగా మహానాడును కడపలో నిర్వహించుకుంటున్నాం అని చెప్పుకున్న టీడీపీ బోర్లా పడింది. సొంత పార్టీ కార్యకర్తల నుంచే ఆదరణ కరవైంది. దీనికి ప్రధాన కారణం నేతలల్లో చిత్తశుద్ధి లేకపోవడమేనని పలువురు చెప్పుకొస్తున్నారు. మహానాడులో రెండో రోజు ఉదయాన్నే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఇక ఆ టెంట్ల కింద ఉన్న జనాలు తప్ప కనుచూపు మేర ఎక్కడా జనం కనిపించలేదు. సొంత పార్టీ కార్యకర్తలే మహానాడుకు డుమ్మా కొట్టడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదని విఽశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement